ఈ మధ్యే ‘ఆచార్య’ టీజర్ అప్డేట్ రాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మీమ్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ అప్డేట్ ఇవ్వకుంటే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ తన మీద తానే పంచ్ వేసుకున్నాడు చిరు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో జనం తన గురించి ఏమనుకుంటున్నారో చిరుకు బాగానే తెలుస్తున్నట్లే ఉంది. ఆ మధ్య ‘పిట్ట కథ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో భాగంగా అనుకోకుండా కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా పేరు ‘ఆచార్య’ అని లీక్ చేసేశారు చిరు.
యథాలాపంగా తాను చేస్తున్న సినిమా ‘ఆచార్య’ అనేసి.. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు చిరు. ఇక ఆయనేదైనా సినిమా వేడుకల్లో పాల్గొన్నా అత్యుత్సాహంతో ఆ సినిమా విశేషాలు బయటపెట్టేస్తుంటారని, అలాగే ఇంకా ఖరారు కాని కాంబినేషన్ల గురించి రివీల్ చేసేస్తాడని కూడా పేరు పడిపోయింది చిరుకు. ఈ నేపథ్యంలోనే ‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన బలహీనత గురించి ఆయన మాట్లాడారు.
తాను మైక్ పట్టుకుంటే చాలు సినిమా విశేషాలన్నీ లీక్ చేసేస్తానేమో అని ‘ఉప్పెన’ నిర్మాతలు భయపడుతున్నారని, కానీ ‘ఉప్పెన’ విశేషాలేమీ బయటపెట్టనని అనడం ద్వారా తనను తాను ముందే నియంత్రించుకున్నారు చిరు. ఈ సందర్భంగానే తన బలహీనత గురించి కూడా ఆయన గుర్తు చేుసుకున్నారు. ‘ఉప్పెన’ సినిమా చూడగానే తాను ఆత్రం ఆపుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలన్నీ చెప్పేసి అందరూ ఈ సినిమాను కచ్చితంగా చూడాలని చెప్పాలని అనుకున్నానని ఈ సందర్భంగా చిరు చెప్పడం విశేషం.
మధ్యలో ఒక చోట సినిమాలోని ఒక డేంజర్ పాయింట్ అంటూ.. దాని గురించి రివీల్ చేయనంటూ మరోసారి తనను తాను నియంత్రించుకున్నారు చిరు. ఇంతా చేసి చివరికి వచ్చేసరికి చిరు ఒక సీక్రెట్ రివీల్ చేసేయడం విశేషం. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే కొత్త సినిమాను నిర్మించబోయేది మైత్రీ అధినేతలే అని చిరు వెల్లడించాడు. బహుశా మైత్రీ వాళ్లు ఘనంగా ఈ ప్రాజెక్టును ప్రకటించాలనుకున్నారేమో. కానీ చిరు అలవాటులో పొరబాటుగా ఈ కాంబినేషన్ గురించి చెప్పేసి తనకున్న ‘లీకు వీరుడు’ పేరును నిలబెట్టుకున్నట్లయింది.
This post was last modified on February 7, 2021 2:49 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…