సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఊపందుకోబోతోంది. ఆయన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ‘శేఖర్’ పేరుతో ఓ సినిమాను మొన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ హిట్ మూవీ ‘జోసెఫ్’కు అది రీమేక్. ఈ సినిమా కోసం పూర్తిగా డీగ్లామరస్ లుక్లోకి మారిపోయారు రాజశేఖర్. ఇప్పటిదాకా ఏ సినిమాలో కనిపించని విధంగా తెల్లటి గడ్డం, ముడతల ముఖంతో సరికొత్తగా ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
దీని తర్వాత మరో యువ దర్శకుడితో పని చేయబోతున్నాడు రాజశేఖర్. అతడి పేరు కిరణ్ కొండమడుగుల. ఇతను అమేజాన్ ప్రైమ్లో రిలీజై మంచి రివ్యూలు తెచ్చుకున్న ‘గతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందరూ కొత్త నటీనటులతో ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ తీసి మెప్పించాడు కిరణ్. ఇప్పుడతను రాజశేఖర్ హీరోగా సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ను శనివారం రిలీజ్ చేశారు. పోస్టర్ మీద ఉమన్ ట్రాఫికింగ్ మీద వచ్చిన ఒక సంచలన వార్త హైలైట్ అవుతున్న న్యూస్ పేపర్, గన్ను, గాగుల్స్, సిగరెట్ దర్శనమిస్తున్నాయి.
దీన్ని బట్టి ఇది ఒక కాప్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. మహిళలను కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్లకు అమ్మేసే ముఠా మీద పోరాటం చేసే పోలీసాఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తాడనే సంకేతాలు అందుతున్నాయి. సృజన్, భార్గవ, హర్ష ప్రతాప్ అనే కొత్త నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక రకంగా రాజశేఖర్ సొంత సినిమాగానే చెప్పాలి దీన్ని. ‘గరుడవేగ’; కల్కి’ చిత్రాల తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ఒకేసారి రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టడం విశేషమే.
This post was last modified on February 6, 2021 5:05 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…