తెలుగులో దటీజ్ మహాలక్ష్మి.. తమిళంలో ప్యారిస్ ప్యారిస్.. కన్నడ, మలయాళ భాషల్లో ఇంకేవో పేర్లు. ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రీమేక్ కావడం, ఒక్కో భాషలో ఒక్కో కథానాయిక లీడ్ రోల్ చేయడం.. అన్నీ ఒకే లోకేషన్లలో వేర్వేరుగా చిత్రీకరణ జరుపుకోవడం.. ఒకేసారి పూర్తి కావడం అరుదైన విషయమే. కానీ ఈ నాలుగు సినిమాల విడుదల సంగతే ఎటూ తేలకుండా పోయింది. బాలీవుడ్లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వికాస్ బల్ రూపొందించిన ‘క్వీన్’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. ‘క్వీన్’ వచ్చిన ఏడాదికే సౌత్ రీమేక్ గురించి వార్తలు మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కానీ కాస్ట్ అండ్ క్రూను ఖరారు చేయడానికే ఏళ్లకు ఏళ్లు పట్టేశాయి. ఎట్టకేలకు రెండేళ్ల కిందట ‘క్వీన్’ రీమేక్లు పట్టాలెక్కాయి. తెలుగు వెర్షన్ దర్శకుడు నీలకంఠ మధ్యలో బాధ్యతలు వదిలేసి వెళ్లిపోగా.. ప్రశాంత్ వర్మ మిగతా పని పూర్తి చేశాడు.
ఏడాది కిందటే నాలుగు భాషల్లోనూ క్వీన్ రీమేక్లు ఫస్ట్ కాపీలతో రెడీ అయ్యాయి. కానీ అవి ఎంతకీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ‘క్వీన్’ నాలుగు టీజర్లలో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షించింది కాజల్ చేసిన తమిళ వెర్షనే. దానికి కూడా టీజర్లోని ఒక బోల్డ్ షాట్ కారణం. తెలుగులో తమన్నా వెర్షన్కు స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. కన్నడ, మలయాళ వెర్షన్లపైనా పెద్దగా ఆసక్తి కనిపించలేదు.
కనీసం త్వరగా ఈ సినిమాలను రిలీజ్ చేసినా ఒక లెక్క. కానీ ఏం ఇబ్బందులో ఏమో కానీ.. కరోనాకు ముందు థియేటర్లు తెరిచి ఉన్నప్పుడూ ఈ సినిమాలను రిలీజ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో ఓటీటీలకూ ఇచ్చేయలేదు. ఇప్పుడు థియేటర్లు పున:ప్రారంభమయ్యాక కూడా ఆ సినిమాల గురించి చప్పుడే లేదు. ఈ సినిమాలకు పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరికి వాళ్లు వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. వాళ్లెవ్వరికీ సినిమాలపై పెద్దగా ఆశలు, ఆసక్తి కూడా ఉన్నట్లు లేదు. అంత ఖర్చు పెట్టి రీమేక్ రైట్స్ కొని, సినిమాలు తీసి ఇలా చేజేతులా వాటిని చంపేయడమేంటో?
This post was last modified on February 2, 2021 10:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…