మామూలుగా అయితే ఫిబ్రవరిని అన్ సీజన్గా భావిస్తారు. ఆ నెలలో పెద్దగా పేరున్న సినిమాలు విడుదల కావు. కానీ గత ఏడాది కరోనా కారణంగా గత ఏడాది చాలా సినిమాలు పెండింగ్లో పడిపోవడం, ఆదాయానికి బాగా కోత పడటంతో ఈసారి అన్ సీజన్ అని కూడా చూడకుండా ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేయబోతున్నారు. ఎప్పట్లా స్కూళ్లు, కాలేజీలు పూర్తి స్థాయిలో నడవకపోవడం, చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో ఫ్యామిలీస్ బాగానే వచ్చి సినిమాలు చూస్తారన్న ఆశతో నిర్మాతలున్నారు. ఈ నెలలో రెండంకెల సంఖ్యలో సినిమాలు విడుదల కానుండటం విశేషం.
అందులో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అన్నింట్లోకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా అంటే.. ‘ఉప్పెన’నే. మెగా ఫ్యామిలీ నుంచి కొత్త కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతుండగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతోనే దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. దేవిశ్రీ పాటలతో పాటు టీజర్, ఇతర ప్రోమోలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక గత ఏడాది ‘భీష్మ’తో ఫిబ్రవరిలో హిట్ కొట్టిన నితిన్.. ఈసారి ‘చెక్’ను ఈ నెలలోనే రేసులో నిలిపాడు. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను రూపొందించడంతో ఇది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఓ వర్గం ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సందీప్ కిషన్ సినిమా ‘ఎ1 ఎక్స్ప్రెస్’ ఇంట్రెస్టింగ్ ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇది తమిళ హిట్ సినిమాకు రీమేక్ కావడంతో బాగా ఆడుతుందనే నమ్మకాలున్నాయి.
ఇక ఫిబ్రవరి తొలి వారంలో విడుదలవుతున్న ‘జాంబి రెడ్డి’కి కూడా ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ ఉంది. ఈ నాలుగు సినిమాలకు తోడు 12న ‘శశి’, ‘ఎఫ్సీయుకె’, 26న ‘అక్షర’ సహా కొన్ని చిన్న చిత్రాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. మరి వీటిలో విజేతగా నిలిచే సినిమా ఏదో చూడాలి. ఉప్పెన, చెక్ చిత్రాల్లోనే ఏదో ఒకటి టాప్లో నిలుస్తుందని అంచనా.
This post was last modified on February 2, 2021 3:22 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…