తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆ స్థాయి ఇమేజ్ సంపాదించిన కథానాయిక అంటే అనుష్క అనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలోనే ‘అరుంధతి’ లాంటి సాహసోపేత, భారీ చిత్రంలో నటించి తిరుగులేని పాపులారిటీ, మంచి మార్కెట్ సంపాదించుకుందామె. ఆ తర్వాత ఆమె నుంచి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. మూడేళ్ల కిందట ‘భాగమతి’తో అనుష్క ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. చివరగా ఆమె నుంచి వచ్చిన ‘నిశ్శబ్దం’ సైతం లేడీ ఓరియెంటెడ్ మూవీనే. దానికీ మంచి హైప్ వచ్చింది. కానీ సినిమా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయింది.
ఈ సినిమా చేయడానికి ముందు, తర్వాత అనుష్క చాలానే గ్యాప్ తీసుకుంది. ఆమెను మళ్లీ స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్లో చూసే అవకాశాలైతే ఎంతమాత్రం కనిపించడం లేదు.
అదే సమయంలో ‘నిశ్శబ్దం’ ఎఫెక్ట్ కూడా పడి అనుష్క నుంచి కొత్త సినిమా ప్రకటనే లేకపోయింది. ఆమె ఇక రిటైరైపోతుందేమో అన్న వాళ్లూ లేకపోలేదు.
కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ అనుష్క కొత్త సినిమాను అంగీకరించినట్లు సమాచారం. రమేష్ అనే ఓ కొత్త దర్శకుడితో అనుష్క సినిమా చేయనుందట. ఆమె ఎక్కువగా సినిమాలు చేసినా, తనకు మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీస్తారని, త్వరలోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.
మరోవైపు అనుష్క.. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్తో ఓ సినిమా చేయొచ్చని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అనుష్క కోసం ఆయన చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఇద్దరు వేర్వేరు కమిట్మెంట్ల వల్ల కలిసి సినిమా చేయలేకపోతున్నారని, ఈ ఏడాది వీరి కలయికలో సినిమా ఉండొచ్చని కూడా అంటున్నారు.
This post was last modified on February 2, 2021 10:48 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…