Movie News

అనుష్క ఈజ్ బ్యాక్?


తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆ స్థాయి ఇమేజ్ సంపాదించిన కథానాయిక అంటే అనుష్క అనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలోనే ‘అరుంధతి’ లాంటి సాహసోపేత, భారీ చిత్రంలో నటించి తిరుగులేని పాపులారిటీ, మంచి మార్కెట్ సంపాదించుకుందామె. ఆ తర్వాత ఆమె నుంచి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. మూడేళ్ల కిందట ‘భాగమతి’తో అనుష్క ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. చివరగా ఆమె నుంచి వచ్చిన ‘నిశ్శబ్దం’ సైతం లేడీ ఓరియెంటెడ్ మూవీనే. దానికీ మంచి హైప్ వచ్చింది. కానీ సినిమా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయింది.

ఈ సినిమా చేయడానికి ముందు, తర్వాత అనుష్క చాలానే గ్యాప్ తీసుకుంది. ఆమెను మళ్లీ స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్‌లో చూసే అవకాశాలైతే ఎంతమాత్రం కనిపించడం లేదు.
అదే సమయంలో ‘నిశ్శబ్దం’ ఎఫెక్ట్ కూడా పడి అనుష్క నుంచి కొత్త సినిమా ప్రకటనే లేకపోయింది. ఆమె ఇక రిటైరైపోతుందేమో అన్న వాళ్లూ లేకపోలేదు.

కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ అనుష్క కొత్త సినిమాను అంగీకరించినట్లు సమాచారం. రమేష్ అనే ఓ కొత్త దర్శకుడితో అనుష్క సినిమా చేయనుందట. ఆమె ఎక్కువగా సినిమాలు చేసినా, తనకు మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీస్తారని, త్వరలోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.

మరోవైపు అనుష్క.. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయొచ్చని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అనుష్క కోసం ఆయన చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఇద్దరు వేర్వేరు కమిట్మెంట్ల వల్ల కలిసి సినిమా చేయలేకపోతున్నారని, ఈ ఏడాది వీరి కలయికలో సినిమా ఉండొచ్చని కూడా అంటున్నారు.

This post was last modified on February 2, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago