Movie News

నిమ్మగడ్డ కూడా విచారణకు రావాల్సిందేనా?

ఏపీలో తీవ్ర కలకలం రేపిన రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అప్పటికే షెడ్యూల్ ప్రకటించేసిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా నిలిపివేస్తున్నట్లుగా నిమ్మగడ్డ… జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు పెద్ద షాకే ఇచ్చారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ సర్కారు… వ్యూహాత్మకంగా ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తప్పించేసి… ఆ పదవిలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించేసింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. ఇదిలా ఉంటే.. ఎన్నికలను వాయిదా వేసిన తనకు భద్రత కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై పెను దుమారమే రేగింది. ఈ లేఖ నిమ్మగడ్ తన కార్యాలయంలో రాయలేదని, బయట ఎక్కడో తయారైన ఈ లేఖను నిమ్మగడ్డ కేంద్రానికి పంపారన్న వాదనలు వినిపించాయి. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న ఏపీ సీఐడీ ఇప్పటికే నిమ్మగడ్డకు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని విచారించింది. అయితే ఈ విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏకంగా నిమ్మగడ్డను కూడా విచారించే అవకాశాలున్నాయంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బుధవారం చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి.

ఈ దిశగా సునీల్ కుమార్ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో రాసినది కాదు. ఈ లేఖను ఎక్కడ తయారు చేశారనే విషయంపై రమేశ్ కుమార్ పర్సనల్ సెక్రటరీ సాంబమూర్తిని విచారించాం. ఎస్ఈసీ రమేశ్ కుమార్ డిక్టేట్ చేస్తుంటే తాను డెల్ ల్యాప్ టాప్ లో టైప్ చేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత దాన్ని స్కాన్ చేశాను, సంతకం తీసుకున్నాను, వాట్సాప్ పంపించాను అంటూ ఆయన ఒక కథనాన్ని చెప్పారు. ఇదే సమయంలో తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారు. ఆ ఫైల్ ఎక్కడుందని అడిగితే డిలీట్ చేశానని చెప్పారు. ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. కాన్ఫిడెన్షియల్ లెటర్ కదా అని అనుకున్నప్పటికీ… హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం లేదు. ఆ లెటర్ ఆఫీసులో తయారు కాలేదు, బయట తయారయిందనేదే అసలైన అభియోగం. ఆ లేఖ అక్కడే తయారైనట్టు తేలి ఉంటే అంతటితో విచారణ ముగిసేది. అక్కడ తయారు కాలేదనే కోణంలోనే విచారణను ముందుకు తీసుకెళ్లాం. నిమ్మగడ్డ రమేశ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని… అయితే ఆయన వెర్షన్ ఏమిటో కూడా తెలుసుకోవాలని, విచారణలో ఇదొక భాగం’’ అని సునీల్ కుమార్ చెప్పారు.

సునీల్ కుమార్ వెర్షన్ చూస్తుంటే… నిమ్మగడ్డను సీఐడీ విచారించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిని విచారణకు పిలవడమంటేనే ఓ పెద్ద తతంగం. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయి ఉండి… రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డను విచారించడమంటే మరింత పెద్ద తతంగమే కదా. అంతేకాకుండా తనను టార్గెట్ చేసి మరీ వైసీపీ సర్కారు వేధిస్తోందని ఇప్పటికే నిమ్మగడ్డ హైకోర్టుకు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని నిమ్మగడ్డ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. దీనిపైనే ఇప్పుడు రచ్చ సాగుతుంటే… ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డను విచారించాల్సి ఉందంటూ సీఐడీ చీఫ్ పేర్కొనడం మరింత సంచలనంగా మారిందనే చెప్పాలి. మరి ఈ వ్యవహారంలో మరెన్ని సంచలనాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

This post was last modified on May 6, 2020 10:00 pm

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

2 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

2 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

3 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

5 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

5 hours ago