మెగాస్టార్ చిరంజీవి యమ స్పీడు మీదున్నాడు ఈ మధ్య. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక.. ఆయన స్వల్ప వ్యవధిలో నాలుగు సినిమాలు ఖరారు చేశారు. అందులో ఒకటి.. ఆచార్య. అది పూర్తి కావస్తోంది. వేసవిలో విడుదలవుతోంది. దీని తర్వాత చిరు లూసిఫర్ రీమేక్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్లో నటిస్తాడు.
ఆపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అతడి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది. ఈ మధ్యే తాను పని చేయబోయే దర్శకుల్లో బాబీ కూడా ఉన్న సంగతి మరోసారి చిరు ధ్రువీకరించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఆ తర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు పచ్చ జెండా ఊపాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే క్రాక్తో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేనిని చిరు తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అతడితో సినిమా చేయడానికి చిరు అంగీకారం తెలిపాడట. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదని, నిజంగానే హామీ ఇచ్చాడని అంటున్నారు. గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడన్నది టాక్. అ
లాగే క్రాక్ హిందీ రీమేక్కు కూడా అతనే దర్శకత్వం వహించనున్నాడట. కొంచెం ముందు వెనుకగా ఈ రెండు సినిమాలను అవగొట్టి.. ఆ తర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు పనిలో పడతాడట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో కచ్చితంగా వీరి సినిమా పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరుతో తన సినిమా ఓకే అయిందని గోపీచంద్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on January 31, 2021 10:55 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…