Movie News

ఆ రెండూ అయ్యాక చిరుతోనే..

మెగాస్టార్ చిరంజీవి య‌మ స్పీడు మీదున్నాడు ఈ మ‌ధ్య‌. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక‌.. ఆయ‌న స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో నాలుగు సినిమాలు ఖ‌రారు చేశారు. అందులో ఒక‌టి.. ఆచార్య‌. అది పూర్తి కావ‌స్తోంది. వేస‌విలో విడుద‌ల‌వుతోంది. దీని త‌ర్వాత చిరు లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించనున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాలం రీమేక్‌లో న‌టిస్తాడు.

ఆపై కె.ఎస్.ర‌వీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అత‌డి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లే ఉంది. ఈ మ‌ధ్యే తాను ప‌ని చేయ‌బోయే ద‌ర్శ‌కుల్లో బాబీ కూడా ఉన్న సంగ‌తి మ‌రోసారి చిరు ధ్రువీక‌రించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల‌న్నీ పూర్తి చేయ‌డానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆ త‌ర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు ప‌చ్చ జెండా ఊపాడ‌న్న‌ది తాజా స‌మాచారం.

ఇటీవ‌లే క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న గోపీచంద్ మ‌లినేనిని చిరు త‌న ద‌గ్గ‌రికి పిలిపించుకుని మ‌రీ అభినందించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా అత‌డితో సినిమా చేయ‌డానికి చిరు అంగీకారం తెలిపాడ‌ట‌. ఇదేదో మాట వ‌ర‌స‌కు అన్న మాట కాద‌ని, నిజంగానే హామీ ఇచ్చాడ‌ని అంటున్నారు. గోపీచంద్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేయ‌బోతున్నాడ‌న్న‌ది టాక్. అ

లాగే క్రాక్ హిందీ రీమేక్‌కు కూడా అత‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. కొంచెం ముందు వెనుక‌గా ఈ రెండు సినిమాలను అవ‌గొట్టి.. ఆ త‌ర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు ప‌నిలో ప‌డ‌తాడ‌ట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో క‌చ్చితంగా వీరి సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. చిరుతో త‌న సినిమా ఓకే అయింద‌ని గోపీచంద్ త‌న స‌న్నిహితుల‌తో చెబుతున్న‌ట్లు తెలిసింది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

6 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

7 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

7 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

8 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

8 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago