మెగాస్టార్ చిరంజీవి యమ స్పీడు మీదున్నాడు ఈ మధ్య. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక.. ఆయన స్వల్ప వ్యవధిలో నాలుగు సినిమాలు ఖరారు చేశారు. అందులో ఒకటి.. ఆచార్య. అది పూర్తి కావస్తోంది. వేసవిలో విడుదలవుతోంది. దీని తర్వాత చిరు లూసిఫర్ రీమేక్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్లో నటిస్తాడు.
ఆపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అతడి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది. ఈ మధ్యే తాను పని చేయబోయే దర్శకుల్లో బాబీ కూడా ఉన్న సంగతి మరోసారి చిరు ధ్రువీకరించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఆ తర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు పచ్చ జెండా ఊపాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే క్రాక్తో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేనిని చిరు తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అతడితో సినిమా చేయడానికి చిరు అంగీకారం తెలిపాడట. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదని, నిజంగానే హామీ ఇచ్చాడని అంటున్నారు. గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడన్నది టాక్. అ
లాగే క్రాక్ హిందీ రీమేక్కు కూడా అతనే దర్శకత్వం వహించనున్నాడట. కొంచెం ముందు వెనుకగా ఈ రెండు సినిమాలను అవగొట్టి.. ఆ తర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు పనిలో పడతాడట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో కచ్చితంగా వీరి సినిమా పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరుతో తన సినిమా ఓకే అయిందని గోపీచంద్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on January 31, 2021 10:55 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…