మెగాస్టార్ చిరంజీవి యమ స్పీడు మీదున్నాడు ఈ మధ్య. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక.. ఆయన స్వల్ప వ్యవధిలో నాలుగు సినిమాలు ఖరారు చేశారు. అందులో ఒకటి.. ఆచార్య. అది పూర్తి కావస్తోంది. వేసవిలో విడుదలవుతోంది. దీని తర్వాత చిరు లూసిఫర్ రీమేక్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్లో నటిస్తాడు.
ఆపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అతడి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది. ఈ మధ్యే తాను పని చేయబోయే దర్శకుల్లో బాబీ కూడా ఉన్న సంగతి మరోసారి చిరు ధ్రువీకరించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఆ తర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు పచ్చ జెండా ఊపాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే క్రాక్తో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేనిని చిరు తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అతడితో సినిమా చేయడానికి చిరు అంగీకారం తెలిపాడట. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదని, నిజంగానే హామీ ఇచ్చాడని అంటున్నారు. గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడన్నది టాక్. అ
లాగే క్రాక్ హిందీ రీమేక్కు కూడా అతనే దర్శకత్వం వహించనున్నాడట. కొంచెం ముందు వెనుకగా ఈ రెండు సినిమాలను అవగొట్టి.. ఆ తర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు పనిలో పడతాడట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో కచ్చితంగా వీరి సినిమా పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరుతో తన సినిమా ఓకే అయిందని గోపీచంద్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on January 31, 2021 10:55 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…