మెగాస్టార్ చిరంజీవి యమ స్పీడు మీదున్నాడు ఈ మధ్య. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక.. ఆయన స్వల్ప వ్యవధిలో నాలుగు సినిమాలు ఖరారు చేశారు. అందులో ఒకటి.. ఆచార్య. అది పూర్తి కావస్తోంది. వేసవిలో విడుదలవుతోంది. దీని తర్వాత చిరు లూసిఫర్ రీమేక్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్లో నటిస్తాడు.
ఆపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అతడి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది. ఈ మధ్యే తాను పని చేయబోయే దర్శకుల్లో బాబీ కూడా ఉన్న సంగతి మరోసారి చిరు ధ్రువీకరించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఆ తర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు పచ్చ జెండా ఊపాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే క్రాక్తో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేనిని చిరు తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అతడితో సినిమా చేయడానికి చిరు అంగీకారం తెలిపాడట. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదని, నిజంగానే హామీ ఇచ్చాడని అంటున్నారు. గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడన్నది టాక్. అ
లాగే క్రాక్ హిందీ రీమేక్కు కూడా అతనే దర్శకత్వం వహించనున్నాడట. కొంచెం ముందు వెనుకగా ఈ రెండు సినిమాలను అవగొట్టి.. ఆ తర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు పనిలో పడతాడట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో కచ్చితంగా వీరి సినిమా పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరుతో తన సినిమా ఓకే అయిందని గోపీచంద్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on January 31, 2021 10:55 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…