టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. గురువారం ఏకంగా ఐదు కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించగా.. శుక్రవారం ఇంకో మూడు చిత్రాలకు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు. అందులో ‘సర్కారు వారి పాట’ లాంటి భారీ చిత్రం కూడా ఉండటం విశేషం. కొన్ని రోజుల కిందటే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. దుబాయ్లో 25 రోజుల తొలి షెడ్యూల్ మొదలుపెట్టారు.
ఈ మధ్య టాలీవుడ్లో శరవేగంగా సినిమాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ కూడా నాలుగైదు నెలల్లో అయిపోతుందని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల ఉంటుదని అనుకున్నారు. కానీ పరశురామ్ కొంచెం ఎక్కువ సమయం తీసుకోబోతున్నాడని స్పష్టమైంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ఖాయం చేశారు. సంక్రాంతికి మహేష్ నుంచి ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బిజినెస్ మ్యాన్’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరపురాని సినిమాలు వచ్చాయి.
ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరోసారి తన చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలబెట్టాలని నిర్ణయించాడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకున్న తొలి సినిమా ఇదే. ఐతే ఆ పండక్కి ఇంకో రెండు భారీ చిత్రాలు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారమే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తారని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి.
ఈ మేరకు ప్రకటన కూడా వస్తుందని అంటుండగా.. మహేష్ కర్చీఫ్ వేసేశాడు. అయినా సరే ప్రభాస్ సినిమా వెనక్కి తగ్గదంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది మేలో మొదలుపెడతాడని, దాన్ని కూడా సంక్రాంతికే అనుకుంటున్నారని ఓ ప్రచారం నడుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ల మధ్య ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ను 2022 సంక్రాంతికి చూడబోతున్నామన్నమాట.
This post was last modified on January 29, 2021 5:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…