సంక్రాంతిక కానుగా ఈ నెల 13న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది ‘మాస్టర్’ సినిమా. డివైడ్ టాక్ను గట్టుకుని ఈ చిత్రం మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. తమిళనాడులో ఇంకా కూడా థియేటర్లలో బాగానే ఆడుతోంది. ఐతే రెండు వారాలు తిరిగేసరికి సినిమాను ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధపడటం, అందుకు హీరో విజయ్ కూడా మద్దతుగా నిలవడం డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడటం లేదు.
ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపించాయి. ఇంత పెద్ద సినిమాను థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో విడుదల చేస్తే ఇక థియేటర్ల వ్యవస్థ ఏం బతుకుతుందన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ చిత్ర నిర్మాతలు అవేమీ పట్టించుకోలేదు. అనుకున్నట్లే ఈ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ‘మాస్టర్’ను ప్రైమ్లో స్ట్రీమ్ చేసేయబోతున్నారు.
ఐతే భారీ రేట్లు పెట్టి ‘మాస్టర్’ను కొన్న తమ పరిస్థితి ఏంటని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ కారణంగా గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని.. ఇలాంటి సమయంలో థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో వదిలి తమ కడుపులు కొట్టడం అన్యాయమని వారంటున్నారు. తమ ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నందుకు గాను ‘మాస్టర్’ నిర్మాతలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా గ్రాస్ వసూళ్లలోంచి తమకు దక్కే షేర్లో పది శాతం అదనంగా ఇవ్వాలని, మాస్టర్ నిర్మాతల నిర్ణయం వల్ల తమ ఆదాయంలో కోత పడుతున్న మొత్తానికి ఇది పరిహారం అని వారు అంటున్నారు.
ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి నిర్మాతలకు మొర పెట్టుకున్నారు. ఐతే లాక్ డౌన్ టైంలో ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసమని 50 పర్సంట్ ఆక్యుపెన్సీలో థియేటర్లలో రిలీజ్ చేశామని, డిస్ట్రిబ్యూటర్లకు కొంత తక్కువ మొత్తాలకే సినిమాను అమ్మామని, అలాంటపుడు త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా కొంచెం ఎక్కువ రేటు దక్కుతున్న తమను ఇలా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టడం ఏంటని ‘మాస్టర్’ మేకర్స్ అంటున్నారు. ఈ గొడవపై ఏం తేలుతుందో ఏమో కానీ.. ‘మాస్టర్’ అయితే శుక్రవారం రాత్రి ప్రైమ్లోకి వచ్చేస్తోంది.
This post was last modified on January 29, 2021 11:21 am
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…