మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మలి చిత్రాన్ని పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు దీపిక పడుకోన్ కూడా ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. రాధేశ్యామ్ తర్వాత ఆ సినిమానే అనుకుంటూ వుండగా మధ్యలో ఆదిపురుష్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే సలార్ కూడా వచ్చి చేరింది. దీంతో ప్రభాస్ అసలు ఈ ఏడాది నాగ్ అశ్విన్కు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఎదురయింది. మామూలుగా అయితే దర్శకులు చిరాకు పడి వేరే ఆప్షన్ వెతుక్కుంటారు. లేదా ఈలోగా మరో సినిమా మొదలు పెడతారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా చేస్తానంటూ ఎదురు చూస్తున్నాడు.
తన దర్శకత్వంలో తదుపరి వచ్చే పూర్తిస్థాయి చిత్రం ఇదేనని అశ్విన్ సొంత వారితో స్పష్టంగా చెబుతున్నాడు. అయితే ఈలోగా సమయం వృధా కాకుండా వైజయంతి మూవీస్ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నాడు. అశ్వనీదత్ జమానా ముగిసింది కనుక ఇప్పటి తరానికి నచ్చే కథలను ఎంచుకుని అశ్విన్ తన మామగారి బ్యానర్కు కొత్త కళ తీసుకొస్తున్నాడు. అలాగే నెట్ఫ్లిక్స్ కోసం పిట్టకథలు సినిమాలో ఒక భాగం డైరెక్ట్ చేసాడు. ప్రభాస్ వచ్చేలోగా అలాంటి చిన్న చిన్న ప్రయత్నాలేవైనా చేసుకుంటూ వుంటాడట. తాను తీయబోయే తదుపరి సినిమా మాత్రం ప్రభాస్తోనే వుంటుందట.
This post was last modified on January 26, 2021 12:13 am
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…