మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మలి చిత్రాన్ని పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు దీపిక పడుకోన్ కూడా ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. రాధేశ్యామ్ తర్వాత ఆ సినిమానే అనుకుంటూ వుండగా మధ్యలో ఆదిపురుష్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే సలార్ కూడా వచ్చి చేరింది. దీంతో ప్రభాస్ అసలు ఈ ఏడాది నాగ్ అశ్విన్కు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఎదురయింది. మామూలుగా అయితే దర్శకులు చిరాకు పడి వేరే ఆప్షన్ వెతుక్కుంటారు. లేదా ఈలోగా మరో సినిమా మొదలు పెడతారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా చేస్తానంటూ ఎదురు చూస్తున్నాడు.
తన దర్శకత్వంలో తదుపరి వచ్చే పూర్తిస్థాయి చిత్రం ఇదేనని అశ్విన్ సొంత వారితో స్పష్టంగా చెబుతున్నాడు. అయితే ఈలోగా సమయం వృధా కాకుండా వైజయంతి మూవీస్ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నాడు. అశ్వనీదత్ జమానా ముగిసింది కనుక ఇప్పటి తరానికి నచ్చే కథలను ఎంచుకుని అశ్విన్ తన మామగారి బ్యానర్కు కొత్త కళ తీసుకొస్తున్నాడు. అలాగే నెట్ఫ్లిక్స్ కోసం పిట్టకథలు సినిమాలో ఒక భాగం డైరెక్ట్ చేసాడు. ప్రభాస్ వచ్చేలోగా అలాంటి చిన్న చిన్న ప్రయత్నాలేవైనా చేసుకుంటూ వుంటాడట. తాను తీయబోయే తదుపరి సినిమా మాత్రం ప్రభాస్తోనే వుంటుందట.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని…
ఒక టాప్ హీరో వారసత్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టి అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. మొత్తం ఇండియన్…
పెద్దిలో అందరూ రామ్ చరణ్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. దర్శకుడు…
జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని,…
కొన్ని నెలలుగా సరైన పెద్ద సినిమా లేని టైంలో రిలీజైంది పెద్ది. ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్న టైంలో విడుదల కావడం…
జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి…