సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. కొన్నేళ్ల కిందట ఇటలీ మ్యుజీషియన్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతను అప్పట్లో చెన్నైకి రావడం.. శ్రుతి, ఆమె తండ్రి కమల్తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఒక వేడుకలో కూడా పాల్గొనడం తెలిసిందే. ఇక వీళ్లిద్దరి పెళ్లే తరువాయి అనుకుంటుండగా.. అనూహ్యంగా ఆ బంధానికి తెరపడింది. ఇద్దరూ విడిపోయి ఎవరి దారుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. శ్రుతి మళ్లీ సినిమాల్లో బిజీ అయింది.
ఐతే తాజాగా అభిమానులతో ఓ చిట్ చాట్ సందర్భంగా శ్రుతి.. మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు మీ ఎక్స్ బాయ్ఫ్రెండ్ను ద్వేషిస్తున్నారా అని అడిగితే.. “నువ్వు చాలా చెడ్డ వాడిలా ఉన్నావ్. నేను నా జీవితంలో ఎవరినీ ద్వేషించను. అలా జరగదు. కానీ ఆ విషయంలో కొంచెం బాధ ఉంది” అని బదులిచ్చింది.
మరోవైపు తన ముఖానికి జరిగిన ప్లాస్టిక్ సర్జరీ గురించి ఓ అభిమాని అడిగితే.. అది జరిగి 11 ఏళ్లు అవుతోందని.. ఇంకా దాని గురించి మాట్లాడటం అవసరమా అని ప్రశ్నించింది శ్రుతి హాసన్. మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారటగా అని అడిగితే అలాంటిదేమీ లేదని.. ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి లేదని ఆమె తేల్చి చెప్పింది.
మీరు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారా అని అడిగితే.. నిజమేనేమో అంటూ బదులిచ్చి ఊహాగానాలకు తావిచ్చింది శ్రుతి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన శ్రుతికి.. తెలుగులో క్రాక్ మూవీతో అదిరిపోయే రీఎంట్రీ దక్కింది. తమిళంలో ఆమె లాభం సహా మరో సినిమాలో నటిస్తోంది.
This post was last modified on January 25, 2021 10:55 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…