మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఆయన కెరీర్లో ఆ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు చూసినా ఎంగేజింగ్గా ఉండి.. ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే లక్షణాలున్న చిత్రమిది. లుక్, యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్లు, ఫైట్లు.. ఇలా ఏది చూసుకున్నా మెగాస్టార్ ది బెస్ట్ అన్నట్లు కనిపిస్తారా చిత్రంలో.
హీరో ఎలివేషన్లకు తోడు ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండిన చిత్రమిది. ఈ సినిమాలో చిరు సోదరులుగా మురళీ మోహన్, శరత్ కుమార్ గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. సినిమాలో చూస్తున్నపుడు ఈ ముగ్గురూ నిజంగా అన్నదమ్ములా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా వారి కెమిస్ట్రీ కుదిరింది సినిమాలో.
ఇంకో రెండు నెలల్లో గ్యాంగ్ లీడర్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుండగా.. ఈ ముగ్గురు రీల్ బ్రదర్స్ అనుకోకుండా కలవడం విశేషం. రామోజీ ఫిలిం సిటీలో చిరు ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా.. మురళీ మోహన్ ఆర్కా మీడియా వాళ్లు తీస్తున్న కొత్త సినిమా షూటింగ్లో ఉన్నారు. అదే సమయంలో శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ షూటింగ్ కోసం ఫిలిం సిటీకి వచ్చారు.
ఈ సంగతి ముగ్గురికీ తెలిసి ఒక చోట కలిశారు. చిరునే ఫొటో దిగుదాం అని చెప్పడంతో ముగ్గురూ కలిసి పోజులిచ్చారు. ఇప్పుడా ఫొటో ఒకవైపు, గ్యాంగ్ లీడర్ చిత్రంలో ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసే దృశ్యాన్ని ఒక వైపు పెట్టి 30 ఏళ్ల తర్వాత కలిసి గ్యాంగ్ లీడర్ బ్రదర్స్ అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు మెగా అభిమానులు.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…