మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఆయన కెరీర్లో ఆ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు చూసినా ఎంగేజింగ్గా ఉండి.. ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే లక్షణాలున్న చిత్రమిది. లుక్, యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్లు, ఫైట్లు.. ఇలా ఏది చూసుకున్నా మెగాస్టార్ ది బెస్ట్ అన్నట్లు కనిపిస్తారా చిత్రంలో.
హీరో ఎలివేషన్లకు తోడు ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండిన చిత్రమిది. ఈ సినిమాలో చిరు సోదరులుగా మురళీ మోహన్, శరత్ కుమార్ గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. సినిమాలో చూస్తున్నపుడు ఈ ముగ్గురూ నిజంగా అన్నదమ్ములా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా వారి కెమిస్ట్రీ కుదిరింది సినిమాలో.
ఇంకో రెండు నెలల్లో గ్యాంగ్ లీడర్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుండగా.. ఈ ముగ్గురు రీల్ బ్రదర్స్ అనుకోకుండా కలవడం విశేషం. రామోజీ ఫిలిం సిటీలో చిరు ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా.. మురళీ మోహన్ ఆర్కా మీడియా వాళ్లు తీస్తున్న కొత్త సినిమా షూటింగ్లో ఉన్నారు. అదే సమయంలో శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ షూటింగ్ కోసం ఫిలిం సిటీకి వచ్చారు.
ఈ సంగతి ముగ్గురికీ తెలిసి ఒక చోట కలిశారు. చిరునే ఫొటో దిగుదాం అని చెప్పడంతో ముగ్గురూ కలిసి పోజులిచ్చారు. ఇప్పుడా ఫొటో ఒకవైపు, గ్యాంగ్ లీడర్ చిత్రంలో ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసే దృశ్యాన్ని ఒక వైపు పెట్టి 30 ఏళ్ల తర్వాత కలిసి గ్యాంగ్ లీడర్ బ్రదర్స్ అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 25, 2021 9:18 am
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…