కొన్నేళ్లుగా తమిళనాట విజయ్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. టాక్తో సంబందం లేకుండా అతడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మెర్సల్ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. అది చాలాసార్లు చూసిన కమర్షియల్ సినిమాల రీహ్యాష్ లాగే ఉంటుంది. ఆ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
సర్కార్ సైతం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక చివరగా అతడి నుంచి వచ్చిన బిగిల్ సైతం రొటీన్ సినిమానే అయినా.. వసూళ్లకు ఢోకా లేకపోయింది. ఇప్పుడు బాక్సాఫీస్కు అత్యంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో విడుదలైన అతడి కొత్త చిత్రం మాస్టర్ సాధిస్తున్న వసూళ్లు ఔరా అనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్ర గ్రాస్ వసూళ్లు రూ.200 కోట్ల మార్కును టచ్ చేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
ఒక్క తమిళనాడులో మాత్రమే మాస్టర్ రూ.100 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఇక మలయాళంలో విజయ్ సినిమాలు తమిళనాడు తరహాలోనే ఆడతాయి. అక్కడ గ్రాస్ భారీగానే వచ్చింది. కర్ణాటకలోనూ ఈ సినిమా జోరు కొనసాగుతోంది. ఉత్తరాదిన సైతం మాస్టర్ డబ్బింగ్ వెర్షన్ను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.
కరోనా విరామం తర్వాత విదేశాల్లో అత్యంత భారీగా విడుదలైన చిత్రం ఇదే. అన్ని చోట్లా టాక్తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఓ ప్రాంతీయ చిత్రానికి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లంటే సామాన్యమైన విషయం కాదు. విజయ్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగిపోయాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే విజయ్ జోరు ఇంకెలా ఉండేదో?
This post was last modified on January 24, 2021 10:40 pm
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…