తెలుగు సినిమా చరిత్రలో కామెడీ అనే అధ్యాయంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. తన గురువు జంధ్యాలకు దీటుగా ఆయన కామెడీ పండించారు. కెరీర్లో ఎక్కువగా ఆ జానర్లోనే సినిమాలు తీశారు. ప్రపంచంలోనే మరే ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు పరిశ్రమ ఒక సమయంలో పదుల సంఖ్యలో కమెడియన్లతో కళకళలాడిందంటే అందులో ఈవీవీ పాత్ర కూడా కీలకం.
ఆయన సినిమాల్లో ఎప్పుడూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఉండేవాళ్లు. వాళ్లందరికీ మంచి పాత్రలుండేవి. కామెడీ డోస్ ఓ రేంజిలో ఉండేది. తన కొడుకు అల్లరి నరేష్కు కూడా కామెడీ సినిమాలతో ఎన్నో హిట్లు ఇచ్చాడు ఈవీవీ. ఆయన చనిపోయి ఈ జనవరి 21 నాటికి పదేళ్లు పూర్తయింది. టీవీల్లో ఆయన సినిమాలు వచ్చినపుడల్లా ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుని ఈవీవీ చాలా త్వరగా వెళ్లిపోయారే అనుకుంటూ ఉంటారు.
ఇక ఈవీవీ లేని లోటు మరింతగా కనిపించేది ఆయన తనయుడు నరేష్ సినిమాలు చూసినపుడే. తండ్రి వెళ్లిపోయిన తర్వాతి ఏడాది నుంచే నరేష్ కెరీర్ గాడి తప్పింది. సుడిగాడు మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు కరవయ్యాయి. ఈవీవీ ఉండగా.. మధ్య మధ్యలో నరేష్కు ఫ్లాపులు వచ్చినా ఆయన వెంటనే చెయ్యిచ్చి ఆదుకునేవారు. మంచి కామెడీ సినిమాతో అతణ్ని ట్రాక్లోకి తెచ్చేవారు. ఆయన మరణానంతరం నరేష్ కెరీర్ను గాడిన పెట్టేవాళ్లే లేకపోయారు. అతను ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.
తాజాగా నరేష్ నుంచి బంగారు బుల్లోడు సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకుల తిరస్కారానికి గురైనట్లే కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ గతంలో నరేష్తో ఈవీవీ చేసిన రూరల్ కామెడీ సినిమాలే గుర్తుకొచ్చి ఉంటాయి ప్రేక్షకులకు. ఇదే కథ ఈవీవీ చేతిలో పడితే.. తన మార్కు వెటకారాన్ని, హాస్యాన్ని జోడించి పాస్ మార్కులతో బయటపడేసేవాడేమో అనిపిస్తుంది. పాపం నరేష్కు తండ్రి లేని లోటు ఇప్పటికీ ఇలా కొనసాగుతుండటం విచారకరం.
This post was last modified on January 24, 2021 11:26 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…