తెలుగు సినిమా చరిత్రలో కామెడీ అనే అధ్యాయంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. తన గురువు జంధ్యాలకు దీటుగా ఆయన కామెడీ పండించారు. కెరీర్లో ఎక్కువగా ఆ జానర్లోనే సినిమాలు తీశారు. ప్రపంచంలోనే మరే ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు పరిశ్రమ ఒక సమయంలో పదుల సంఖ్యలో కమెడియన్లతో కళకళలాడిందంటే అందులో ఈవీవీ పాత్ర కూడా కీలకం.
ఆయన సినిమాల్లో ఎప్పుడూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఉండేవాళ్లు. వాళ్లందరికీ మంచి పాత్రలుండేవి. కామెడీ డోస్ ఓ రేంజిలో ఉండేది. తన కొడుకు అల్లరి నరేష్కు కూడా కామెడీ సినిమాలతో ఎన్నో హిట్లు ఇచ్చాడు ఈవీవీ. ఆయన చనిపోయి ఈ జనవరి 21 నాటికి పదేళ్లు పూర్తయింది. టీవీల్లో ఆయన సినిమాలు వచ్చినపుడల్లా ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుని ఈవీవీ చాలా త్వరగా వెళ్లిపోయారే అనుకుంటూ ఉంటారు.
ఇక ఈవీవీ లేని లోటు మరింతగా కనిపించేది ఆయన తనయుడు నరేష్ సినిమాలు చూసినపుడే. తండ్రి వెళ్లిపోయిన తర్వాతి ఏడాది నుంచే నరేష్ కెరీర్ గాడి తప్పింది. సుడిగాడు మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు కరవయ్యాయి. ఈవీవీ ఉండగా.. మధ్య మధ్యలో నరేష్కు ఫ్లాపులు వచ్చినా ఆయన వెంటనే చెయ్యిచ్చి ఆదుకునేవారు. మంచి కామెడీ సినిమాతో అతణ్ని ట్రాక్లోకి తెచ్చేవారు. ఆయన మరణానంతరం నరేష్ కెరీర్ను గాడిన పెట్టేవాళ్లే లేకపోయారు. అతను ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.
తాజాగా నరేష్ నుంచి బంగారు బుల్లోడు సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకుల తిరస్కారానికి గురైనట్లే కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ గతంలో నరేష్తో ఈవీవీ చేసిన రూరల్ కామెడీ సినిమాలే గుర్తుకొచ్చి ఉంటాయి ప్రేక్షకులకు. ఇదే కథ ఈవీవీ చేతిలో పడితే.. తన మార్కు వెటకారాన్ని, హాస్యాన్ని జోడించి పాస్ మార్కులతో బయటపడేసేవాడేమో అనిపిస్తుంది. పాపం నరేష్కు తండ్రి లేని లోటు ఇప్పటికీ ఇలా కొనసాగుతుండటం విచారకరం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…