ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగి, ఆ తర్వాత అవకాశాలు కోల్పోయి పెళ్లిచేసుకుని సెటిల్ అయ్యింది హీరోయిన్ భూమిక చావ్లా. పెళ్లైన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, కన్నడ, మలయాళ, బాలీవుడ్లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది భూమిక.
అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే, ఎలాంటి బోల్డ్ సీన్స్లో నటించడానికైనా సై అంటోంది ఈ 41 ఏళ్ల హీరోయిన్. మారిన ప్రపంచంతో పాటు మనమూ మారాలంటున్న భూమిక… సీనియర్ హీరోయిన్ టబులా బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి రెఢీ అంటోంది.
పవన్ కళ్యాణ్కు ‘ఖుషీ’, మహేష్బాబుకు ‘ఒక్కడు’, ఎన్టీఆర్కు ‘సింహాద్రి’…ఇలా ఈ ముగ్గురు స్టార్లకు కెరీర్లో మొట్టమొదటి బ్లాక్బస్టర్ అందించిన హీరోయిన్ భూమిక. అయితే అంతటి లక్కీ హీరోయిన్, ఆ తర్వాత సినిమాల సెలక్షన్లో వేసిన తప్పటడుగు కారణంగా అవకాశాలు కోల్పోయి, స్టార్డమ్ చేజార్చుకుంది.
పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చిన భూమిక… నాని ‘ఎమ్.సీ.ఏ’, నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాల్లో వదిన, అక్క పాత్రల్లో మెప్పించింది. బాలకృష్ణ ‘రూలర్’, సమంత ‘యూటర్న్’ మూవీస్లో కనిపించిన భూమిక… రోటీన్ పాత్రలు కాకుండా ‘అంధాదున్’లో టబులాంటి బోల్డ్ క్యారెక్టర్స్ కోరుకుంటోందట.
అయితే మొదటి నుంచి భూమికను పద్ధతైన పాత్రల్లోనే చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమెను బోల్డ్ అండ్ సెక్సీ సీన్స్లో యాక్సెప్ట్ చేస్తారా? అనేది అనుమానమే. ఇదిలావుంటే ‘అంధాదున్’ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో టబు పాత్రను అనసూయ పోషిస్తోందనే టాక్ కొన్నాళ్ళు వినబడింది. తరువాత ఆ రోల్ కోసం టబు వచ్చిందన్నారు, రమ్యకృష్ణ దిగిందని చెప్పారు. వీళ్లందరికంటే భూమిక లాంటి సీనియర్ హీరోయిన్ అయితే ఇంపాక్ట్ బాగానే ఉంటుంది కాని, ఆ ఆఫర్ ఈమెకు వస్తుందంటారా?
This post was last modified on May 6, 2020 1:08 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…