నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఐదారేళ్లుగా చర్చ నడుస్తోంది. 2016-17 టైంలో అయితే అతడి అరంగేట్రానికి అంతా సిద్ధమైందని.. ఇక ప్రకటనే తరువాయి అని కూడా అన్నారు. బాలయ్య సైతం 2017లో తన కొడుకు అరంగేట్రం ఖాయం అని ప్రకటించాడు కూడా. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఆ ఊసే లేకపోయింది. మోక్షజ్ఞ ఇప్పటిదాకా సినిమాల వైపు చూడలేదు.
మధ్యలో ఒకట్రెండుసార్లు అతడి లుక్ చూస్తే ఇతను హీరో ఏంటి అనిపించింది. పూర్తిగా అదుపు తప్పిన ఫిజిక్తో ఉన్న నందమూరి కుర్రాడు.. తనకు సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే కనిపించాడు. దీంతో ఈ మధ్య అతడి తెరంగేట్రం గురించి అభిమానులు మాట్లాడ్డం కూడా మానేశారు. ఆ చర్చ పూర్తిగా పక్కకు వెళ్లిపోయిన ఈ తరుణంలో మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.
గత ఏడాది బాలయ్య పుట్టిన రోజు తర్వాత మోక్షజ్ఞ ఎక్కడా కనిపించింది లేదు. ఐతే ఆ తర్వాత అతను తన ఫిజిక్ మీద దృష్టిపెట్టాడని.. కసరత్తులు చేస్తున్నాడని.. ఈ ఏడాది అతడి అరంగేట్ర సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు. బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమాను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నాడని అంటున్నారు.
మోక్షు కోసం ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేశాడని.. బాలయ్య కూడా దానికి ఆమోద ముద్ర వేశాడని ఒక ప్రచారం మొదలైంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ ప్రచారం అయితే ఆసక్తికరంగానే అనిపిస్తోంది కానీ.. నిజంగా ఇది జరుగుతుందా అని నందమూరి అభిమానుల్లోనే సందేహాలున్నాయి. మరి ఈ ప్రచారంపై నందమూరి కుటుంబ వర్గాలు ఏమంటాయో చూడాలి.
This post was last modified on January 23, 2021 2:40 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…