తెలుగులో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. తెలుగు సినిమా ఒక మూసలో నడుస్తున్న సమయంలో ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు లాంటి విభిన్న సినిమాలతో అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ యేలేటి సినిమాల్లో కమర్షియల్గా సక్సెస్ అందుకున్నవి తక్కువ. అందుకే అతడి కెరీర్ అనుకున్నంతగా జోరందుకోలేదు.
స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం, షూటింగ్ చేయడంలో యేలేటి కొంచెం నెమ్మది అన్న సంగతీ తెలిసిందే. అందుకే దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో అరడజను సినిమాలే చేశాడు. చివరగా 2016లో ‘మనమంతా’ సినిమాతో అతను ప్రేక్షకులను పలకరించాడు. మళ్లీ ఇప్పుడు నితిన్ హీరోగా ‘చెక్’ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.
‘చెక్’ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయిపోవడంతో విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. అన్ సీజన్ అయినప్పటికీ సినిమా మీద నమ్మకంతో ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖర్లో నితిన్ మరో సినిమా ‘రంగ్ దె’ విడుదల కానుంది. ఆ తర్వాత వేసవి అంతా ఊపిరి సలపని విధంగా షెడ్యూల్ ఉన్నాయి. పెద్ద సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. అందుకే ముందుగా ఫిబ్రవరిలో ‘చెక్’ను రిలీజ్ చేసేయాలని ఫిక్సయ్యారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్. ఆయన గత ఏడాది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో విజయాన్నందుకున్నారు.
‘చెక్’లో నితిన్ చెస్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. చేయని నేరానికి అతడికి జీవిత ఖైదు పడితే చెస్ను ఆధారంగా చేసుకుని ఎలా తన సమస్యల నుంచి బయటపడ్డాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో యేలేటి బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on January 22, 2021 6:45 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…