సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రస్థానం మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన కొన్నేళ్ల కిందటే తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేశారు. కానీ పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్లడంలో ఆలస్యం చేశారు. తీరా ఇక రంగంలోకి దిగుదాం అనుకునే సమయానికి కరోనా వచ్చి అడ్డం పడింది. తన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి రావడం మంచిది కాదనుకున్నారు. అభిమానులకు క్షమాపణ చెప్పి రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.
ఐతే ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. రజినీ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా వాళ్లు ఈ కరోనా టైంలో రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. రజినీ నటిస్తున్న ‘అన్నాత్తె’ సంగతి ఎటూ తేలకుండా పోయింది. ఈ సినిమా షూటింగ్ను డిసెంబర్లో రజినీ పున:ప్రారంభించడం.. వారం తిరిగేసరికి ఆ చిత్ర బృందంలో పలువురు కరోనా బారిన పడటంతో ఆ సినిమా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ దెబ్బకు రజినీ తన రాజకీయ అరంగేట్రంపైనా వెనక్కి తగ్గారు. తన నిర్ణయం తర్వాత అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని రజినీ ముందే ఊహించాడు. కానీ ఆ వ్యతిరేకత ఆయన అంచనా వేయలేని స్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రజినీ ఇల్లు దాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ‘అన్నాత్తె’ షూటింగ్ సైతం చేయలేని స్థితిని ఎదుర్కొంటున్నారు.
రాజకీయాల్లోకి రాకపోవడానికి అనారోగ్య కారణాలు చెప్పిన రజినీ.. ఇప్పుడు వెంటనే వెళ్లి షూటింగ్లో పాల్గొంటే అభిమానులు ఊరుకోరు. కొంత కరోనా భయం కూడా వెంటాడుతుండటంతో ఈ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే పున:ప్రారంభించొద్దని రజినీ భావిస్తున్నారట. దీంతో ఈ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడో ఈ సినిమా పూర్తి చేసి మరో సినిమా మీదికి వెళ్లాల్సిన దర్శకుడు శివకు ఎటూ పాలుపోవడం లేదు. వేరే ఆర్టిస్టుల డేట్లన్నీ వృథా అయిపోతున్నాయి. ఐతే రజినీ మాటను కాదని ఏమీ చేసే పరిస్థితి లేకపోవడంతో అతను, సన్ పిక్చర్స్ అధినేతలు సూపర్ స్టార్ ఎప్పుడు వస్తారా అని వేచి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
This post was last modified on January 22, 2021 4:45 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…