పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమాలకు టాటా చెప్పేసేవారు లేదంటే హీరోయిన్ల పాత్రలు పక్కన పెట్టి వదిన, అక్క పాత్రలకు మారేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెళ్లి తర్వాత కూడా ఎంచక్కా హీరోయిన్ పాత్రలు చేస్తున్నారు. గ్లామర్ రోల్స్తోనూ ఆకట్టుకుంటున్నారు. శ్రియ, సమంత లాంటి వాళ్లు ఇందుకు ఉదాహరణ. ఈ కోవలోనే కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి తర్వాత స్పీడు చూపిస్తోంది.
పెళ్లికి ముందు ఒప్పుకున్న ఇండియన్-2, ఆచార్య లాంటి భారీ చిత్రాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న కాజల్.. వీటితో పాటు కొత్త సినిమాలూ ఒప్పుకుంటోంది. ఇప్పటికే తమిళంలో డీకే అనే దర్శకుడితో కొత్త సినిమాను ఒప్పుకున్న కాజల్ అగర్వాల్.. కళ్యాణ్ అనే మరో యువ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం. ఈ చిత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవాతో ఆమె రొమాన్స్ చేయబోతోందట.
డ్యాన్స్ మాస్టర్గా, హీరోగా, దర్శకుడిగా ప్రతిభ చాటిన ప్రభుదేవా.. ఈ మధ్య నటుడిగా మళ్లీ బిజీ అవుతున్నాడు. దర్శకత్వానికి కొంచెం బ్రేక్ ఇచ్చి వరుసగా సినిమాలు చేసిన అతను.. రెండేళ్ల కిందట మళ్లీ మెగా ఫోన్ పట్టి సల్మాన్ ఖాన్తో ‘దబంగ్-3’ తీశాడు. ఆ సినిమా సరిగా ఆడకపోయినా మళ్లీ ప్రభుదేవాతో ‘రాధె’ సినిమా చేస్తున్నాడు సల్మాన్. అది ఈ ఏడాది రంజాన్కు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తీస్తూనే తమిళంలో ‘భగీరా’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభుదేవా. ఇప్పుడు అతను, కాజల్ జంటగా కళ్యాణ్ అనే దర్శకుడు ఓ రొమాంటిక్ కామెడీ తీయడానికి సిద్ధమవుతున్నాడట. ఇంతకుముందు తమన్నాతో రెండు సినిమాల్లో రొమాన్స్ చేసిన ప్రభుదేవా.. ఇప్పుడు కాజల్ లాంటి మరో అగ్ర కథానాయికతో జోడీ కడుతుండటం విశేషమే. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్న కాజల్.. ‘ఇండియన్-2’ షెడ్యూళ్లను బట్టి కొత్త సినిమాకు డేట్లు ఇవ్వనుంది.
This post was last modified on January 22, 2021 2:08 pm
ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా…
శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి.…
ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక…
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…