లేడీ యాంకర్లు హీరోయిన్లవ్వగా లేనిది మనం హీరో ఎందుకు కాకూడదు అన్నట్లుగా ఓ సినిమా చేసి పడేశాడు టాలీవుడ్ టాప్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అతను కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ పరిస్థితులు మామూలుగా ఉంటే ప్రదీప్ హీరోగా అరంగేట్రం చేసి 10 నెలలు అయ్యేది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.
ఇలాంటి చిన్న సినిమాను ఓటీటీకి ఇచ్చి సరిపెడతారని అనుకున్నారు కానీ.. దీని నిర్మాతలు అలా ఏమీ చేయలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకునే వరకు ఎదురు చూశారు. మంచి టైమింగ్ చూసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 29న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే కథేంటన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. సినిమాలో అనేక కోణాలున్నాయని.. ఏదో కొత్తగానే ట్రై చేశారని అర్థమవుతోంది.
ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు కలిసి రిలీజ్ చేయబోతుండటం. ఈ రెండు సంస్థలు కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘భలే భలే మగాడివోయ్’; ‘ప్రతి రోజూ పండగే’ లాంటి చిత్రాలను కలిసి నిర్మించాయి. విడి విడిగా కొత్త సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ కూడా ఉంటాయి. ఐతే ఈ రెండు సంస్థలూ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ లాంటి ఓ చిన్న సినిమాను టేకప్ చేసి కలిసి రిలీజ్ చేయబోతుండటం విశేషమే.
సినిమా మీద వాళ్లకు మంచి గురి అయినా కుదిరి ఉండాలి లేదంటే ప్రదీప్ తన పలుకుబడిని ఉపయోగించి హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా కోసం వీళ్లను రంగంలోకి దించి ఉండాలి. ఈ రెండు పెద్ద బేనర్లు రిలీజ్ చేస్తున్నాయంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనే ప్రేక్షకులు భావిస్తారు. మరి గీతా, యువి బ్రాండ్స్ ఈ సినిమాకు ఏ మేర కలిసొస్తాయో చూడాలి. మున్నా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్గా చేసింది.
This post was last modified on January 22, 2021 7:29 am
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…