మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంత వరకు ఫెయిల్యూర్ అన్నదే లేని, స్టార్లను అద్భుతంగా ప్రెజెంట్ చేసే సామర్థ్యం ఉన్న కొరటాల శివ లాంటి అగ్ర దర్శకుడితో చిరు జట్టు కట్టడం ఇందుకు ప్రధాన కారణం.
‘ఆచార్య’ అనే ఆకర్షణీయ టైటిల్, రామ్ చరణ్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం కూడా అంచనాల్ని పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. ఇప్పుడిక ‘ఆచార్య’ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కొంచెం దేశభక్తి కోణం కూడా ఉన్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ కానుకగా ‘ఆచార్య’ టీజర్ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.
‘ఆచార్య’ టీజర్ గురించి ఇప్పటిదాకా ఏ సంకేతాలు రాలేదు. గణతంత్ర దినోత్సవాన టీజర్ రిలీజ్ అయ్యేుట్లయితే అది మెగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే. ఐతే మే 9న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో టీజర్ వదలడానికి ఇది సరైన సమయంగా కొరటాల అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి సంక్రాంతికే ‘ఆచార్య’ టీజర్ను ఆశించారు అభిమానులు. కానీ అప్పుడు ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజవడంతో అదే సమయంలో ఇంకో ట్రీట్ ఎందుకని భావించి ఉండొచ్చు. గణతంత్ర దినోత్సవాన సోలోగా టీజర్ రిలీజ్ చేస్తే ఎక్కువ హైప్ వస్తుందని అనుకుని ఉండొచ్చు. మరి టీజర్లో చిరును కొరటాల ఎలా చూపిస్తాడు.. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది.. ఆయన ఏం పంచ్ పేలుస్తాడు.. మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్తో టీజర్ను ఎలా ఎలివేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 21, 2021 2:32 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…