నెట్ ఫ్లిక్స్ ఇండియా తీసిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ల్లో ‘లస్ట్ స్టోరీస్’ ఒకటి. అసలు నెట్ ఫ్లిక్స్కు ఇండియాలో పాపులారిటీ తెచ్చిందే ఈ సిరీస్. ఇందులో ముఖ్యంగా కియారా అద్వానీ మీద తీసిన సన్నివేశాలు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాయి. అవి రేపిన సంచలనంతోనే మన ప్రేక్షకుల దృష్టి నెట్ ఫ్లిక్స్ మీద పడింది. దానికి సబ్స్క్రప్షన్లు వచ్చాయి.
ఇప్పుడు ఆ సిరీస్కు తెలుగు వెర్షన్గా తెరకెక్కిందే ‘పిట్ట కథలు’. రెండేళ్ల కిందటే ఈ సిరీస్కు సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఈ ప్రాజెక్టుకు అన్నీ సిద్ధం చేసి షూటింగ్ చేయడంలో, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడంలో చాలా ఆలస్యం జరిగింది. అందుకు కరోనా కూడా ఒక కారణం. ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్కు రెడీ అయింది. ఫిబ్రవరి 19న ప్రిమియర్స్ డేట్ కూడా ఇచ్చారు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఐతే లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ అనేసరికి ప్రేక్షకుల దృష్టంతా ‘లస్ట్’ మీదే నిలిచింది. హిందీలో మాదిరే ఇక్కడా బోల్డ్ యాక్ట్స్ ఉంటాయా అని చూశారు. ‘పిట్ట కథలు’ టీజర్ చూస్తే ఆ అంచనాలకు తగ్గట్లయితే కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు హాట్గానే ఉన్నట్లున్నాయి కానీ.. అవి ఊరికే అలా మెరిసి మాయమైనట్లుగా చూపించారు టీజర్లో. వాటి మీద పెద్దగా ఫోకస్ కనిపించలేదు. శ్రుతి హాసన్ ఇందులో లెస్బియన్ పాత్ర పోషించిందని ఆమె ఓ అమ్మాయితో చేసిన లిప్ లాక్ సీన్ను బట్టి అర్థమైంది.
ఐతే లెస్బియన్ల శృంగార సన్నివేశాలు మన కుర్రాళ్లను అంతగా ఆకర్షించేవి కావు. ఈషా రెబ్బా అయితే ఏమంత హాట్గా కనిపించలేదు. కానీ అమలా పాల్ మాత్రం ఈ సిరీస్లో హాట్ హాట్గానే నటించిందని టీజర్ కట్స్ చూస్తే అర్థమైంది. పెళ్లి విఫలమయ్యాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అమలా చాలా హాట్ హాట్గానే కనిపిస్తోంది. ‘తిరుట్టుపయలే’తో పాటు ‘ఆమె’ చిత్రంలోనూ ఆమె బోల్డ్ యాక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ అనేసరికి ఇంకా డోస్ పెంచే ఉంటుందని అనుకున్నారు. ‘పిట్ట కథలు’లో బోల్డ్ సీన్స్ పరంగా కుర్రాళ్ల ఆశలన్నీ అమలా మీదే ఉన్నాయని చెప్పొచ్చు.
This post was last modified on January 21, 2021 10:26 am
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…
రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…