హీరోలు, హీరోయిన్ల గురించి పుకార్లు సర్వ సాధారణమే కానీ ఒక డైరెక్టర్ ని పదేపదే గాసిప్స్ వెంటాడవు. కానీ ఏ సూపర్ స్టార్ మీదా రానన్ని పుకార్లు త్రివిక్రమ్ గురించి వస్తున్నాయి. అల వైకుంఠపురములో పెద్ద హిట్ అవడం, తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తుండడంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్. పైగా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదో ఏమో.. ఇక యథేచ్ఛగా గాసిప్ వార్తలు వండి వడ్డించేస్తున్నారు.
ఇందులో తన గురించి ఎక్కువ వస్తుండడం గురూజీ త్రివిక్రమ్ కి షాకింగ్ గా ఉందట. ఆయన మాములుగా వెబ్ సైట్స్ అవీ చూడడట. అయితే లాక్ డౌన్ వేళ తన గురించి వచ్చిన పుకార్లని గురించి తెలిసిన వాళ్ళు వాకబు చేస్తూ వుంటే త్రివిక్రమ్ కే మైండ్ బ్లాక్ అవుతోందట.
ఇన్ని స్టోరీలు తానే ఇంతవరకు రాయలేదని, అసలు సినిమాలు ఎప్పుడు మళ్ళీ దారిలో పడతాయో తెలియక అయోమయంగా వుంటే వాళ్ళతో చేస్తున్నారు, వీళ్ళతో చేస్తున్నారు అంటూ ఈ ప్రచారం ఏమిటని ఆయన తల పట్టుకుంటున్నాడట. వెంకటేష్ తో ఆయన సినిమా ఉంటుందని వచ్చిన వార్తలో కూడా నిజం లేదు. ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఫిక్స్ అయింది. ఎంత లేట్ అయినా కానీ త్రివిక్రమ్ మలి చిత్రం మాత్రం అదే ఉంటుంది.
This post was last modified on May 5, 2020 8:03 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…