హీరోలు, హీరోయిన్ల గురించి పుకార్లు సర్వ సాధారణమే కానీ ఒక డైరెక్టర్ ని పదేపదే గాసిప్స్ వెంటాడవు. కానీ ఏ సూపర్ స్టార్ మీదా రానన్ని పుకార్లు త్రివిక్రమ్ గురించి వస్తున్నాయి. అల వైకుంఠపురములో పెద్ద హిట్ అవడం, తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తుండడంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్. పైగా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదో ఏమో.. ఇక యథేచ్ఛగా గాసిప్ వార్తలు వండి వడ్డించేస్తున్నారు.
ఇందులో తన గురించి ఎక్కువ వస్తుండడం గురూజీ త్రివిక్రమ్ కి షాకింగ్ గా ఉందట. ఆయన మాములుగా వెబ్ సైట్స్ అవీ చూడడట. అయితే లాక్ డౌన్ వేళ తన గురించి వచ్చిన పుకార్లని గురించి తెలిసిన వాళ్ళు వాకబు చేస్తూ వుంటే త్రివిక్రమ్ కే మైండ్ బ్లాక్ అవుతోందట.
ఇన్ని స్టోరీలు తానే ఇంతవరకు రాయలేదని, అసలు సినిమాలు ఎప్పుడు మళ్ళీ దారిలో పడతాయో తెలియక అయోమయంగా వుంటే వాళ్ళతో చేస్తున్నారు, వీళ్ళతో చేస్తున్నారు అంటూ ఈ ప్రచారం ఏమిటని ఆయన తల పట్టుకుంటున్నాడట. వెంకటేష్ తో ఆయన సినిమా ఉంటుందని వచ్చిన వార్తలో కూడా నిజం లేదు. ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఫిక్స్ అయింది. ఎంత లేట్ అయినా కానీ త్రివిక్రమ్ మలి చిత్రం మాత్రం అదే ఉంటుంది.
This post was last modified on May 5, 2020 8:03 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…