హీరోలు, హీరోయిన్ల గురించి పుకార్లు సర్వ సాధారణమే కానీ ఒక డైరెక్టర్ ని పదేపదే గాసిప్స్ వెంటాడవు. కానీ ఏ సూపర్ స్టార్ మీదా రానన్ని పుకార్లు త్రివిక్రమ్ గురించి వస్తున్నాయి. అల వైకుంఠపురములో పెద్ద హిట్ అవడం, తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తుండడంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్. పైగా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదో ఏమో.. ఇక యథేచ్ఛగా గాసిప్ వార్తలు వండి వడ్డించేస్తున్నారు.
ఇందులో తన గురించి ఎక్కువ వస్తుండడం గురూజీ త్రివిక్రమ్ కి షాకింగ్ గా ఉందట. ఆయన మాములుగా వెబ్ సైట్స్ అవీ చూడడట. అయితే లాక్ డౌన్ వేళ తన గురించి వచ్చిన పుకార్లని గురించి తెలిసిన వాళ్ళు వాకబు చేస్తూ వుంటే త్రివిక్రమ్ కే మైండ్ బ్లాక్ అవుతోందట.
ఇన్ని స్టోరీలు తానే ఇంతవరకు రాయలేదని, అసలు సినిమాలు ఎప్పుడు మళ్ళీ దారిలో పడతాయో తెలియక అయోమయంగా వుంటే వాళ్ళతో చేస్తున్నారు, వీళ్ళతో చేస్తున్నారు అంటూ ఈ ప్రచారం ఏమిటని ఆయన తల పట్టుకుంటున్నాడట. వెంకటేష్ తో ఆయన సినిమా ఉంటుందని వచ్చిన వార్తలో కూడా నిజం లేదు. ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఫిక్స్ అయింది. ఎంత లేట్ అయినా కానీ త్రివిక్రమ్ మలి చిత్రం మాత్రం అదే ఉంటుంది.
This post was last modified on May 5, 2020 8:03 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…