Movie News

ఓటీటీ రిలీజ్‌లపై అగ్ర నిర్మాత కౌంటర్లు


కరోనా-లాక్ డౌన్ కారణంగా థియేటర్లు నెలల తరబడి మూత పడి ఉండటంతో ఇక తప్పదన్నట్లుగా చిన్న, పెద్ద తేడా లేకుండా కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. కానీ కొన్ని చిత్రాల నిర్మాతలు మాత్రం ఓటీటీ ఆఫర్లు ఎన్ని వచ్చినా తిరస్కరించారు. థియేటర్లలోనే తమ చిత్రాలను విడుదల చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. అందులో సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఒకరు.

రామ్ హీరోగా ఆయన నిర్మించిన ‘రెడ్’ గత ఏడాది ఏప్రిల్లోనే రావాల్సింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశాక లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. మధ్యలో ఈ సినిమాకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి మంచి ఆఫర్లే వచ్చినా రవికిషోర్ తలొగ్గలేదు. ఎట్టకేలకు కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది.

ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా ఎందుకు తలొగ్గలేదు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా నిర్మాతల్లా ఎందుకు ఓటీటీ బాట పట్టలేదు అని ఓ ఇంటర్వ్యూలో రవికిషోర్‌ను అడిగితే.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎంత కాలం అయినా ఆగి తమ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నానని.. థియేటర్ కోసం చేసిన సినిమాను ఓటీటీకి ఇవ్వడం కరెక్ట్ కాదన్నది తన అభిప్రాయమని రవికిషోర్ చెప్పారు.

‘‘10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు ఉన్నారు. పది రూపాయలు 9 రూపాయలు వచ్చినా, 12 రూపాయలు వచ్చినా ప్రేక్షకుడి నుంచే నేరుగా రావాలని నేను ఆలోచిస్తా. ఇలాంటి నిర్మాతలం కొంతమంది ఉన్నాం. సినిమా అంటే ప్యాషన్ అని చెప్పినవాళ్లు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే వాళ్ల మాటలను నమ్మవద్దు’’ అంటూ ఓటీటీలకు వెళ్లిన నిర్మాతలపై గట్టి కౌంటరే వేశారు రవికిషోర్. కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ‘రెడ్’ ముందు అనుకున్న దాని కంటే తక్కువ రేట్లకే అమ్మామని.. ఈ సినిమాను కొన్న అందరూ 4 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్‌కు వచ్చారని రవికిషోర్ తెలిపారు.

This post was last modified on January 20, 2021 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

13 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

45 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

51 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

1 hour ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago