Movie News

ఆ హీరోను వెలివేసిన నిర్మాత‌ల మండ‌లి

కోలీవుడ్ వివాదాల వీరుడు శింబు మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ్డాడు. అత‌ను న‌టించిన ‘అన్బాన‌వ‌న్ అస‌రాద‌వ‌న్ అడంగాద‌వ‌న్’ (ఏఏఏ) తాలూకు వివాదం అత‌ణ్ని ఒక ప‌ట్టాన వ‌ద‌లట్లేదు. మూడేళ్లుగా అత‌ను ఈ సినిమా తాలూకు వివాదంలో ప‌డి కొట్టు మిట్టాడుతున్నాడు. ఇప్పుడు ఆ వివాదం కార‌ణంగా తమిళ నిర్మాత‌ల మండ‌లి శింబును వెలివేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..శింబు హీరోగా మైఖేల్‌ రాయప్పన్ అనే నిర్మాత నాలుగేళ్ల కింద‌ట‌ ‘అన్బానవన్‌ – అరసాదవన్‌ – అడంగాదవన్‌’ అనే చిత్రాన్ని మొద‌లుపెట్టాడు. ఐతే ఈ చిత్రానికి మ‌ధ్య‌లో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. అతి క‌ష్టం మీద విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఐతే ఈ సినిమా విష‌యంలో శింబు అస‌లు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని, అనేక ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు గతంలో. ద‌ర్శ‌కుడు సైతం ఆయ‌న‌కే మ‌ద్ద‌తుగా నిలిచాడు.

ఈ విష‌య‌మై త‌మిళ‌ నిర్మాత‌ల మండలి జోక్యం చేసుకుని రాయ‌ప్ప‌న్, శింబు మ‌ధ్య రాజీ కుదిర్చింది. రాయ‌ప్ప‌న్‌కు ఒక సినిమాను ఉచితంగా చేయ‌డం లేదంటే.. ఆయ‌న‌కు రూ.6.6 కోట్ల మొత్తాన్ని మూడు విడత‌లుగా చెల్లించేలా ఇద్ద‌రికి ఒప్పందం కుదిరింది. ఐతే శింబు రాయ‌ప్ప‌న్‌కు ఉచితంగా సినిమానూ చేయ‌లేదు. డ‌బ్బులూ ఇవ్వ‌లేదు.

ఈ విషయ‌మై మైఖేల్‌ రాయప్పన్‌ తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌ అయిన నిర్మాతల మండలి శనివారం అత్యవసరంగా సమావేశమై… శింబు భవిష్యత్తులో నటించే చిత్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని తీర్మానించింది. మ‌రి ఈ తీర్మానంపై శింబు ఎలా స్పందిస్తాడో.. అత‌ను హీరోగా నిర్మాణంలో ఉన్న సినిమాల ప‌రిస్థితేంటో చూడాలి.

This post was last modified on January 19, 2021 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago