సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా నడుస్తున్న క్రాక్ సినిమాకు విడుదల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. నిర్మాతకు చెన్నై ఫైనాన్షియర్లతో ఉన్న ఇబ్బందుల కారణంగా ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9న ఉదయం మొదలైన రగడ రాత్రి వరకు కొనసాగింది. ఎప్పుడో సెకండ్ షోల సమయానికి కానీ సమస్య పరిష్కారం కాలేదు.
అప్పటికప్పుడు టెంపర్ రీమేక్ అయోగ్య చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసే విషయంలో నెలకొన్న వివాదం విషయమై పది కోట్లు అప్పటికప్పుడు సెటిల్ చేస్తే తప్ప సినిమా విడుదలకు మార్గం సుగమం కాలేదు. ఈ విషయంలో నిర్మాత ఠాగూర్ మధు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఆయన్ని కోలీవుడ్ జనాలు ముప్పు తిప్పలే పెట్టారు.
శనివారం అంటే బాక్సాఫీస్కు బాగా కలిసొచ్చే రోజు. ఆ రోజు పూర్తి రెవెన్యూ కోల్పోయిన క్రాక్.. తర్వాత సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకుని ఏమేర నిలబడుతుందో అనుకున్నారు. కానీ ఆ సినిమాలే ఇప్పుడు క్రాక్ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల బాట పట్టింది క్రాక్. కొన్ని ఏరియాలను సొంతంగా రిలీజ్ చేసుకున్న ఠాగూర్ మధు మంచి ఆదాయమే అందుకోనున్నాడు.
అలాగే ఇప్పుడు క్రాక్ రీమేక్ హక్కుల కోసం గట్టి డిమాండ్ ఏర్పడటంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. తనను ఇబ్బంది పెట్టిన చోటి నుంచే డిమాండ్ ఎక్కువగా ఉంది. తమిళ రీమేక్ కోసం అక్కడి నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. క్రాక్ రిలీజ్ కోసం అత్యవసరంగా సెటిల్ చేసిన డబ్బులకు మించి ఆయన లాభాలు అందుకోబోతున్నారు. అలాగే హిందీ రీమేక్ కోసం కూడా ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి క్రాక్ మూవీతో ఠాగూర్ మధు కష్టాలన్నీ తీరిపోయేట్లే ఉన్నాయి.
This post was last modified on January 18, 2021 7:38 am
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…