సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్లది క్రేజీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.
ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. ఇటీవలే పూరి నాగార్జునకు ఒక కథ చెప్పి మెప్పించారని.. త్వరలోనే అది పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు.
నాగ్ కోసం తన శైలికి భిన్నంగా ఒక ఫాంటసీ కథ రాశాడట పూరి. చరిత్రలో వెనుకటి కాలానికి చెందిన ఒక రాజు.. విచిత్ర పరిణామాల మధ్య మళ్లీ ఈ కాలంలోకి అడుగు పెడితే.. తనను తాను ఇప్పటికీ రాజుగానే భావిస్తూ జులుం ప్రదర్శించాలని చూస్తే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. నాగ్ చరిత్ర, రాజుల తరహా కథల్లో నటించలేదు కానీ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఈ టైపు ఫాంటసీ అయితే టచ్ చేశారు. కాబట్టి సరిగ్గా వర్కవుట్ చేస్తే నాగ్కు ఈ కథ బాగానే సూటయ్యే అవకాశముంది.
నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసి తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ‘బంగార్రాజు’ చేస్తాడని.. లేదు లేదు ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని ముందు మొదలుపెడతాడని చర్చ నడుస్తోంది. కానీ ఏదీ ఖరారవ్వలేదు. ఐతే పూరితో సినిమా ఓకే అయితే.. వీటిలో ఏదో ఒక సినిమాను ఈ ఏడాది ప్రథమార్ధంలో ముగించేసి, ద్వితీయార్ధంలో ఆ సినిమాను లాగించే అవకాశముంది.
This post was last modified on January 17, 2021 9:13 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…