సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్లది క్రేజీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.
ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. ఇటీవలే పూరి నాగార్జునకు ఒక కథ చెప్పి మెప్పించారని.. త్వరలోనే అది పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు.
నాగ్ కోసం తన శైలికి భిన్నంగా ఒక ఫాంటసీ కథ రాశాడట పూరి. చరిత్రలో వెనుకటి కాలానికి చెందిన ఒక రాజు.. విచిత్ర పరిణామాల మధ్య మళ్లీ ఈ కాలంలోకి అడుగు పెడితే.. తనను తాను ఇప్పటికీ రాజుగానే భావిస్తూ జులుం ప్రదర్శించాలని చూస్తే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. నాగ్ చరిత్ర, రాజుల తరహా కథల్లో నటించలేదు కానీ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఈ టైపు ఫాంటసీ అయితే టచ్ చేశారు. కాబట్టి సరిగ్గా వర్కవుట్ చేస్తే నాగ్కు ఈ కథ బాగానే సూటయ్యే అవకాశముంది.
నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసి తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ‘బంగార్రాజు’ చేస్తాడని.. లేదు లేదు ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని ముందు మొదలుపెడతాడని చర్చ నడుస్తోంది. కానీ ఏదీ ఖరారవ్వలేదు. ఐతే పూరితో సినిమా ఓకే అయితే.. వీటిలో ఏదో ఒక సినిమాను ఈ ఏడాది ప్రథమార్ధంలో ముగించేసి, ద్వితీయార్ధంలో ఆ సినిమాను లాగించే అవకాశముంది.
This post was last modified on January 17, 2021 9:13 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…