సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్లది క్రేజీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.
ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. ఇటీవలే పూరి నాగార్జునకు ఒక కథ చెప్పి మెప్పించారని.. త్వరలోనే అది పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు.
నాగ్ కోసం తన శైలికి భిన్నంగా ఒక ఫాంటసీ కథ రాశాడట పూరి. చరిత్రలో వెనుకటి కాలానికి చెందిన ఒక రాజు.. విచిత్ర పరిణామాల మధ్య మళ్లీ ఈ కాలంలోకి అడుగు పెడితే.. తనను తాను ఇప్పటికీ రాజుగానే భావిస్తూ జులుం ప్రదర్శించాలని చూస్తే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. నాగ్ చరిత్ర, రాజుల తరహా కథల్లో నటించలేదు కానీ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఈ టైపు ఫాంటసీ అయితే టచ్ చేశారు. కాబట్టి సరిగ్గా వర్కవుట్ చేస్తే నాగ్కు ఈ కథ బాగానే సూటయ్యే అవకాశముంది.
నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసి తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ‘బంగార్రాజు’ చేస్తాడని.. లేదు లేదు ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని ముందు మొదలుపెడతాడని చర్చ నడుస్తోంది. కానీ ఏదీ ఖరారవ్వలేదు. ఐతే పూరితో సినిమా ఓకే అయితే.. వీటిలో ఏదో ఒక సినిమాను ఈ ఏడాది ప్రథమార్ధంలో ముగించేసి, ద్వితీయార్ధంలో ఆ సినిమాను లాగించే అవకాశముంది.
This post was last modified on January 17, 2021 9:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…