ఇంతకుముందులా సినిమాలు వారాలు.. నెలలు ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ కాలం పోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడంతా వీకెండ్ ముచ్చటే. తొలి వారాంతంలో, వారంలో ఎంత రాబట్టామన్నదే కీలకం. అలాంటపుడు సినిమాకు మంచి టాక్ రావడం చాలా అవసరం. రిలీజ్ ముంగిట ఎంత హైప్ ఉన్నప్పటికీ.. టాక్ బాలేకుంటే వీకెండ్ వసూళ్లపై చాలా ప్రభావం పడుతుంది.
పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు మాత్రమే బ్రేక్ ఈవెన్ ఛాన్సుంటుంది. ఐతే అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు మాత్రం నెగెటివ్ టాక్ను తట్టుకుని నిలబడుతుంటాయి. రివ్యూలు, టాక్తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టి సేఫ్ జోన్ వైపు అడుగులు వేస్తుంటాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ సినిమా ‘రెడ్’ కూడా ఈ కోవలోకే చేరేలా ఉంది. ఈ గురువారం సంక్రాంతి పండుగ రోజు విడుదలైన ‘రెడ్’కు యావరేజ్, నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత గొప్పగా కనిపించలేదు.
కానీ ఈ సినిమాకు రివ్యూలు, టాక్ పెద్దగా ప్రభావం చూపనట్లే కనిపిస్తోంది. తొలి రోజు అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసిన ఈ చిత్రం రూ.6.5 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు కూడా రూ.3 కోట్ల దాకా షేర్ వచ్చింది. శనివారం లెక్కలు తేలాల్సి ఉంది. ఆ రోజు కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీతో రన్ అయింది. సినిమా ఓవరాల్గా ఎలా ఉన్నప్పటికీ మాస్ మెచ్చే అంశాలకు లోటు లేకపోవడం, రామ్ పెర్ఫామెన్స్, హెబ్బా పటేల్ ఐటెం సాంగ్, కొన్ని ఎపిసోడ్లు సినిమాకు కలిసొచ్చినట్లే ఉన్నాయి.
వాటితో ఓ వర్గం ప్రేక్షకులు సంతృప్తి చెందినట్లే ఉన్నారు. ఇక సంక్రాంతి సినిమాల్లో అత్యుత్తమ థియేటర్లు దక్కింది ‘రెడ్’కే. స్రవంతి రవికిషోర్కు ఉన్న పేరు, పలుకుబడి బాగానే ఈ చిత్రానికి ఉఫయోగపడ్డట్లున్నాయి. ‘క్రాక్’తో పోలిస్తే వసూళ్లు తక్కువే కానీ.. దానికి దీటుగా థియేటర్లు మాత్రం ఉన్నాయి. దాంతో పోలిస్తే మంచి సెంటర్లలో, మంచి థియేటర్లు ఉన్నాయి.
ఇది సినిమాకు బాగా కలిసొస్తున్నట్లు ఉంది. వీకెండ్ అయ్యే లోపు ‘రెడ్’ బ్రేక్ ఈవెన్కు వచ్చేసినట్లే అంటున్నారు. శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులతోనే ‘రెడ్’కు పెట్టుబడి వెనక్కి వచ్చేయగా.. థియేట్రికల్ హక్కులతో వచ్చేదంతా లాభమే. ఐతే సినిమాను ఓ మోస్తరు రేట్లకే అమ్మడం డిస్ట్రిబ్యూటర్లకు కలిసొస్తోంది.
This post was last modified on January 17, 2021 9:06 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…