సోనూ సూద్ను ఇప్పుడెవరూ ఒక భాష వాడిగా, ఒక ప్రాంతం వాడిగా చూడట్లేదు. కరోనాకు ముందు అతను వేరు, అది వచ్చాక అతను వేరు. దేశం తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో ఎంతోమంది అభాగ్యులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచాడతను. ఇప్పుడు సోనూ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు వారు కూడా అందుకు మినహాయింపు కాదు. సోనూ సాయం అందుకున్న వాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.
కరోనా విరామం తర్వాత అతను తిరిగి షూటింగుల్లో పాల్గొంటోంది తెలుగు చిత్రాలతోనే. ముందు ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని పూర్తి చేసిన అతను.. ఆ తర్వాత ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. సోనూ షూటింగ్కు హాజరైనపుడు.. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ రిలీజ్ సందర్భంగా సోనూకు తెలుగువారి నుంచి వస్తున్న స్పందన అపూర్వం. ‘అల్లుడు అదుర్స్’లో హీరో ఇంట్రో కంటే సోనూ తొలిసారి తెరపై కనిపించినపుడే ఎక్కువ స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి.
సోనూ సూద్ సైతం తెలుగువారిపై తన ప్రత్యేక ప్రేమను దాచుకోలేదు. తెలుగు సినిమా, తెలుగు జనాలు తనకెంత ప్రత్యేకమో అతను ‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్లో వివరించాడు. తాను హిందీ, తెలగు, తమిళ భాషల్లో సినిమాలు చేశానని.. ఇలా ఎన్ని భాషల్లో నటించినా తన ఫస్ట్ లవ్ మాత్రం తెలుగే అని.. ఈ విషయాన్ని తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని సోనూ అన్నాడు.
తాను సినిమాలకు సంబంధించి నేర్చుకున్నదంతా తెలుగు పరిశ్రమ నుంచే అని.. తనపై ఇక్కడి జనాలు చూపించే ప్రేమకు కృతజ్ఞుడనని.. తన భార్య కూడా తెలుగు అమ్మాయే అని.. కాబట్టి తాను ఇక్కడి వాడినే అని భావిస్తానని.. తెలుగు వారంటే తనకు కుటుంబంతో సమానం అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు సోనూ. ఈ వ్యాఖ్యలకు మన వాళ్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు.
This post was last modified on January 17, 2021 3:48 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…