జీవితంలో ఈటీవీ చూడ‌ననుకున్న విజ‌య్…

తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీ ఒక‌టి. 90వ ద‌శ‌కంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న టైంలో ఫ్రీ ఛానెల్‌గా ఉంటూ ఇంటింటికీ చేరువైంది ఈటీవీ. ఆ ఛానెళ్ల‌లో సీరియ‌ళ్లతో పాటు న్యూస్ ప్రోగ్రాంలకూ ఎంతో ఆద‌ర‌ణ ఉండేది. కాక‌పోతే ఆ ఛానెల్లో ఎక్కువ‌గా పాత సినిమాలే ప్ర‌సారం అయ్యేవి. ఈ కార‌ణంతోనే తన‌కు ఈటీవీ అంటే అంత న‌చ్చేది కాదంటున్నాడు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

తాను ఎప్పుడూ ఈటీవీ చూసేవాడిని కాద‌ని.. అందుకు సీరియ‌ళ్లంటే ఇష్టం లేక‌పోవ‌డంతో పాటు, పాత సినిమాల మీద అనాస‌క్తే అని త‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం ఎపిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు విజ‌య్. ఐతే జీవితంలో ఎప్పుడూ ఈటీవీ చూడ‌ను అని కూడా అనుకున్న తాను కూడా ఈటీవీ విన్‌లో నైంటీస్ వెబ్ సిరీస్ చూశాన‌ని.. ఇలా చేసిన ఘ‌న‌త ఆ సిరీస్ ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్‌దే అని విజ‌య్ అన్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌నాలతో పెద్ద ఎత్తున ఈటీవీ విన్ యాప్ డౌన్ లోడ్ చేయించిన ఘ‌న‌త కూడా అత‌డిదే అని.. ఆ యాప్‌కు రీచ్ పెంచింది అత‌ను డైరెక్ట్ చేసిన నైంటీస్ సిరీసే అని విజ‌య్ అన్నాడు. ఆ సిరీస్ చూశాక‌, ఈ డైరెక్ట‌ర్ తీసే సినిమాను టికెట్ కొని చూడాల‌ని అని తాను బ‌లంగా అనుకున్నాన‌ని విజ‌య్ చెప్పాడు. ఆదిత్య త‌న మ‌నిషి అని.. అత‌డిని ఎవ‌రేమ‌న్నా తాను ఊరుకోన‌ని.. త‌న‌ కోసం నిల‌బ‌డ‌తాన‌ని విజ‌య్ ఈ సంద‌ర్భంగా చెప్పాడు.

మ‌రోవైపు ర‌వితేజ సినిమా ఇరుముడి ఇర‌గాడేస్తుండ‌డంపై విజ‌య్ స్పందించాడు. ఈ సినిమా దూకుడు మామూలుగా లేద‌ని.. ర‌వన్న రాంపేజ్ నెక్స్ట్ లెవెల్ అని విజ‌య్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది టాలీవుడ్‌కు చాలా బాగా క‌లిసి వ‌స్తోందని.. వ‌రుస‌గా సినిమాలు హిట్టవుతున్నాయ‌ని.. అవి హిట్ట‌వ‌డం కంటే ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తుండ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిస్తోంద‌ని విజ‌య్ వ్యాఖ్యానించాడు.

మున్ముందు రాబోయే సినిమాల‌న్నీ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయంటూ ఎపిక్, ది ప్యార‌డైజ్, ర‌ణ‌బాలి, మైసా, ఈ న‌గ‌రానికి ఏమైంది-2, ఫౌజి, దాదా చిత్రాల గురించి ప్ర‌స్తావించిన విజ‌య్.. ఈ సినిమాల‌న్నీ బాగా ఆడ‌తాయ‌ని, టాలీవుడ్ 100 ప‌ర్సంట్ స్ట్రైక్ రేట్ సాధిస్తుంద‌ని.. ఇది ఆప‌రేష‌న్ టీఎఫ్ఐ అని వ్యాఖ్యానించాడు. త‌న తమ్ముడి సినిమా ఎపిక్ రిలీజ‌య్యాక వ‌చ్చే నెల త‌న చిత్రం ర‌ణ‌బాలి రిలీజ‌వుతుంద‌ని.. ఆ త‌ర్వాతి నెల ర‌ష్మిక మూవీ మైసా వ‌స్తుంద‌ని.. ఈ సినిమాల ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాను జ‌నాల‌ను క‌లుస్తూనే ఉంటాన‌ని విజ‌య్ అన్నాడు.