కమల్ హాసన్ తనయురాలు హీరోయిన్గా అడుగు పెడుతోందంటే.. ఆయన లాగే ప్రయోగాత్మక పాత్రలు, సినిమాలు ఎక్కువగా చేస్తుందని అంతా అనుకున్నారు కానీ.. శ్రుతి హాసన్ మాత్రం అందుకు భిన్నంగా రొటీన్ గ్లామర్ పాత్రలే చేస్తూ వచ్చింది. మిగతా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్లామర్ విందు చేసింది. ఎక్కువగా ఆమె చేసింది కమర్షియల్ సినిమాలే.
తాజాగా క్రాక్ లాంటి మాస్ మసాలా సినిమాలో ఆమె కనిపించింది. ఐతే కెరీర్లో కొంచెం లేటుగా ఓ ప్రయోగాత్మక, సంచలన పాత్ర చేయడానికి శ్రుతి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐతే ఈ పాత్ర చేయనున్నది సినిమాలో కాదు. వెబ్ సిరీస్లో. దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
తనకంటే రెట్టింపు వయసున్న మిథున్ చక్రవర్తికి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతోందట. ఈ నిన్నటి తరం బాలీవుడ్ నటుడు ప్రధాన పాత్రలో ‘ది బెస్ట్ సెల్లర్ షయీ రోట్ అనే నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. పెద్ద వయస్కుడు, ఎంతో పేరు పొందిన నవలా రచయితకు, అతడి అభిమాని అయిన ఓ యువతికి మధ్య జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీనే ఈ ‘ది బెస్ట్ సెల్లర్ షయీ రోట్. ఇందులో నవలా రచయితగా మిథున్ చక్రవర్తి.. అతడి ప్రేయసిగా శ్రుతి హాసన్ నటించనున్నారట.
ముకుల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయనుండగా.. సిద్ధార్థ్ పి.మల్హోత్రా నిర్మించనున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఇలాంటి పాత్రను చేయడానికి స్టార్ హీరోయిన్లు అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ శ్రుతి ధైర్యం చేసింది. మరి ఈ పాత్రతో శ్రుతి ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 10:58 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…