ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నింట్లోకి బ్యాడ్ రివ్యూలు వచ్చింది అల్లుడు అదుర్స్ సినిమాకే. ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన ఫార్ములాతో ఈ సినిమా తీసి నిరాశ పరిచాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. లాజిక్ లేని, రొటీన్ కథా కథనాలు.. మైండ్ లెస్ కామెడీ.. విపరీతమైన హడావుడి సినిమాను నీరుగార్చేశాయి.
తొలి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ పరీక్షకు నిలవలేకపోయింది. ఐతే చిత్ర బృందం మాత్రం అల్లుడు అదుర్స్ సూపర్ హిట్ అనే అంటోంది. శనివారం సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంపై పరోక్షంగా అతను స్పందించాడు.
సినిమా గురించి ఎవరేమన్నారన్నది ముఖ్యం కాదని.. సినిమా చూసిన ప్రేక్షకులను అడిగితే వాళ్లెంతగా ఎంజాయ్ చేశారో చెబుతారని.. జెన్యూన్ టాక్ తెలుస్తుందని.. వారి ఫీడ్ బ్యాక్ను బట్టి మిగతా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని అతనన్నాడు. దీన్ని బట్టి చూస్తే రివ్యూలను పట్టించుకోవద్దని శ్రీనివాస్ చెప్పకనే చెప్పినట్లయింది.
గత ఏడాది కరోనాతో బాధ పడ్డ జనాలకు మంచి వినోదం అందించి తమ బాధలన్నీ మరిచిపోయేలా చేయాలని ఇలాంటి సినిమా చేశామని శ్రీనివాస్ తెలిపాడు. కరోనా విరామం తర్వాత చాలామంది సినిమాలను మొక్కుబడిగా చుట్టేశారని.. కానీ తమ నిర్మాత మాత్రం అలా రాజీ పడలేదని.. భారీ సెట్టింగ్స్ వేసి.. ఏమాత్రం రాజీ పడకుండా సన్నివేశాలు, పాటలు, ఫైట్లు చిత్రీకరించేలా చూశారని.. ఆ భారీతనం సినిమా నిండా కనిపిస్తుందని శ్రీనివాస్ చెప్పాడు.
This post was last modified on January 17, 2021 10:54 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…