సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగిన సినిమానే ఈ సీజన్ విజేతగా నిలిచింది. పండక్కి ఐదు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా రవితేజ సినిమా ‘క్రాక్’యే సంక్రాంతి విజేత అనడంలో మరో మాట లేదు. టాక్, వసూళ్లు.. దేని పరంగా చూసుకున్నా ఈ చిత్రమే ముందంజలో ఉంది. బుధ, గురు వారాల్లో విడుదలైన మూడు సినిమాల వల్ల ‘క్రాక్’ కొంచెం జోరు తగ్గించినట్లు కనిపించింది కానీ.. వాటి టాక్ తేడా కొట్టడంతో మళ్లీ ఈ సినిమా పుంజుకుంది.
ఇప్పుడు థియేటర్లలో ఎక్కువ సందడి కనిపిస్తున్నది ‘క్రాక్’ చిత్రానికే. వీకెండ్లో ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టేలా ఉంది. ఐతే థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆహా’ వారు ఓ సినిమాపై పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే. అందులో రిలీజవుతున్న అతి పెద్ద సినిమా కూడా ‘క్రాక్’యే. ఐతే థియేటర్లలో రిలీజైన నెలలోనే డిజిటల్ రిలీజ్ చేసుకునేలా ఒప్పందం కుదిరిందట. ఈ నెల 29న ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారట.
ఈ మేరకు ఓటీటీలో కొత్త సినిమాల అప్ డేట్లు ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు పీఆర్వోలు కూడా వీటిని రీట్వీట్ చేశారు. కానీ అంతలో ఆ ట్వీట్లను డెలీట్ చేశారు. ఇంకో రెండు వారాల్లోపే డిజిటల్లో రిలీజవుతుందని తెలిస్తే జనాలు థియేటర్లకు రావడం మానేస్తారని.. థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను చంపేసినట్లు అవుతుందని.. బాక్సాఫీస్ రన్ పూర్తయ్యే వరకు డిజిటల్ రిలీజ్ గురించి సమాచారం షేర్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్లు డెలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వారం తర్వాత దీని గురించి అధికారిక అప్ డేట్ బయటికి రావచ్చేమో. 29నే సినిమా డిజిటల్లో రిలీజైతే ఆశ్చర్య పడాల్సిన పని లేదు.
This post was last modified on January 16, 2021 9:20 pm
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…