సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగిన సినిమానే ఈ సీజన్ విజేతగా నిలిచింది. పండక్కి ఐదు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా రవితేజ సినిమా ‘క్రాక్’యే సంక్రాంతి విజేత అనడంలో మరో మాట లేదు. టాక్, వసూళ్లు.. దేని పరంగా చూసుకున్నా ఈ చిత్రమే ముందంజలో ఉంది. బుధ, గురు వారాల్లో విడుదలైన మూడు సినిమాల వల్ల ‘క్రాక్’ కొంచెం జోరు తగ్గించినట్లు కనిపించింది కానీ.. వాటి టాక్ తేడా కొట్టడంతో మళ్లీ ఈ సినిమా పుంజుకుంది.
ఇప్పుడు థియేటర్లలో ఎక్కువ సందడి కనిపిస్తున్నది ‘క్రాక్’ చిత్రానికే. వీకెండ్లో ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టేలా ఉంది. ఐతే థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆహా’ వారు ఓ సినిమాపై పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే. అందులో రిలీజవుతున్న అతి పెద్ద సినిమా కూడా ‘క్రాక్’యే. ఐతే థియేటర్లలో రిలీజైన నెలలోనే డిజిటల్ రిలీజ్ చేసుకునేలా ఒప్పందం కుదిరిందట. ఈ నెల 29న ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారట.
ఈ మేరకు ఓటీటీలో కొత్త సినిమాల అప్ డేట్లు ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు పీఆర్వోలు కూడా వీటిని రీట్వీట్ చేశారు. కానీ అంతలో ఆ ట్వీట్లను డెలీట్ చేశారు. ఇంకో రెండు వారాల్లోపే డిజిటల్లో రిలీజవుతుందని తెలిస్తే జనాలు థియేటర్లకు రావడం మానేస్తారని.. థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను చంపేసినట్లు అవుతుందని.. బాక్సాఫీస్ రన్ పూర్తయ్యే వరకు డిజిటల్ రిలీజ్ గురించి సమాచారం షేర్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్లు డెలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వారం తర్వాత దీని గురించి అధికారిక అప్ డేట్ బయటికి రావచ్చేమో. 29నే సినిమా డిజిటల్లో రిలీజైతే ఆశ్చర్య పడాల్సిన పని లేదు.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…