Movie News

ప్రేయసితో హీరో పెళ్లి ఫిక్స్


బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న పెళ్లి అంటే రణబీర్ కపూర్-ఆలియా భట్‌లదే. కరోనా-లాక్ డౌన్ లేకుంటే గత ఏడాదే తమ పెళ్లి జరిగేదని.. ఈ ఏడాది కచ్చితంగా తాను, ఆలియా పెళ్లి చేసుకుంటామని రణబీర్ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే రణబీర్ పెళ్లి ముహూర్త ఎప్పుడో ఏమో కానీ.. ఈలోపు మరో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న నటాషా దలాల్‌నే వరుణ్ పెళ్లాడబోతున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారం వీరి పెళ్లి ఈ నెల 24నే జరగబోతోంది.

ముంబయిలోని అలీ బాగ్‌లో ఒక పెద్ద రిసార్ట్‌ను పూర్తిగా వరుణ్, నటాషాల పెళ్లి కోసం బుక్ చేశారు. కరోనా ప్రభావం ఇంకా కొనసాగబోతున్న నేపథ్యంలో ఈ పెళ్లికి అతిథుల సంఖ్య పరిమితంగా ఉండబోతోంది. ఇరు కుటుంబాలకు చెందిన వంద మంది అతిథులకు మించి పెళ్లిలో ఉండబోరట. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక సాగనుంది.

ఐతే బాలీవుడ్ నుంచి వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సల్మాన్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, మరికొందరు ఈ పెళ్లికి హాజరు కానున్నారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకైన వరుణ్ ధావన్.. 2012లో కరణ్ జోహార్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అతడికి మంచి ఆరంభాన్నే ఇచ్చింది. ఆ తర్వాత మై తేరా హీరో, బద్లాపూర్, ఏబీసీడీ-2, బద్రీనాథ్ కి దుల్హానియా, జుడ్వా-2 అక్టోబర్ లాంటి హిట్లు వరుణ్‌కు మంచి పేరు తెచ్చాయి. అతడికి స్టార్ ఇమేజ్ కూడా తీసుకొచ్చాయి.

వరుణ్ ఇటీవలే ‘కూలీ నంబర్ వన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 90ల్లో ఇదే పేరుతో విడుదలైన సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ అమేజాన్ ప్రైమ్‌లో వ్యూస్ మాత్రం భారీగానే వచ్చాయి. నటాషాతో దాదాపు నాలుగేళ్లుగా వరుణ్ డేటింగ్ చేస్తున్నాడు. చివరికి ఆమెనే అతను పెళ్లి చేసుకుంటున్నాడు.

This post was last modified on January 16, 2021 2:12 pm

Share

Recent Posts

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

22 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

1 hour ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

8 hours ago