రాజ్ తరుణ్ హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ అతడి చివరి హిట్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ తర్వాత అతడికది హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. ఆపై రాజ్ తరుణ్ పది సినిమాలకు పైగానే చేశాడు. వాటిలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. సినిమా సినిమాకూ అతడి స్థాయి, మార్కెట్ పడుతూ వచ్చి.. చివరికి ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సమయానికి పూర్తిగా కింద పడిపోయాడు.
ఇలాంటి సమయంలో రాజ్ కొత్త చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ కావడం అతడికి ఉపశమనమే. ఓటీటీలో కాబట్టి జనాలు ఓ మోస్తరుగా చూశారు. పెద్దగా విషయం లేని ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే పెద్ద షాక్ తగిలేదే. ‘ఒరేయ్ బుజ్జిగా’ను హిట్గా ప్రచారం చేసుకున్న రాజ్ తరుణ్, దాని దర్శకుడు విజయ్ కుమార్ కొండా తమ కలయికలో ఇంకో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.
ఈసారి తమ గత చిత్రానికి భిన్నమైన సినిమానే చేయబోతోంది ఈ జోడీ. ఈ సినిమా పేరు.. పవర్ ప్లే. ఇదొక సీరియస్ థ్రిల్లర్ అనే విషయం, టైటిల్, దాని లోగో, ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ మీద రక్తపు మరకలున్నాయి. రాజ్ తరుణ్ సీరియస్గా గన్ను పట్టుకుని కూర్చుని ఉన్నాడు. పోస్టర్ థీమ్ అంతా కూడా సినిమా చాలా సీరియస్గా ఉంటుందని, థ్రిల్లింగ్గా సాగుతుందని సంకేతాలు ఇస్తోంది. దేవేష్, మహిధర్ అనే కొత్త నిర్మాతలు వనమాలి క్రియేషన్స్ అనే బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ తరహా సీరియస్ థ్రిల్లర్ చేయడం విజయ్ కుమార్కు కొత్త. తొలి రెండు సినిమాలు గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా ప్రేమకథ లవ్ స్టోరీలు కాగా.. మూడోది కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడు థ్రిల్లర్ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. జానర్ మార్చిన రాజ్కు ఈ చిత్రంతో అయినా మంచి ఫలితం అందుతుందేమో చూడాలి.
This post was last modified on January 15, 2021 6:00 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…