మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ హీరోల్లో స్ఫూర్తిదాయక ప్రయాణం అంటే రవితేజదే. అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్నేళ్లు ఆ విభాగంలోనే శ్రమించి.. ఆ తర్వాత క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేసి.. ఆపై హీరోగా చిన్న సినిమాలు చేసి.. చివరికి స్టార్ ఇమేజ్ సంపాదించి ‘మాస్ మహారాజా’గా పేరు తెచ్చుకున్న ఆసక్తికర ప్రస్థానం అతడిది. ప్రస్తుతం టాప్ స్టార్ల తర్వాతి స్థాయిలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటుడు రవితేజే. అతడికి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుతోంది.
లేటెస్ట్ మూవీ ‘క్రాక్’లో లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల తర్వాత ఈ రేంజిలో రెమ్యూనరేషన్ తీసుకోవడమంటే మాటలు కాదు. రెండు మూడు వరుస హిట్లు పడితే మాస్ రాజా రేంజ్ ఇంకా పెరగొచ్చు.
ఐతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న రవితేజ.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..? కేవలం 3500 రూపాయలట. ఆ డబ్బులు ఇచ్చింది సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కావడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవితేజే స్వయంగా వెల్లడించాడు. నాగ్ సొంత సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్లో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’ అసిస్టెంట్ డైరెక్టర్గా తన తొలి చిత్రమని.. ఆ సినిమాకు కృష్ణవంశీ కింద పని చేశానని.. అందుకు గాను నాగ్ రూ.3500 మొత్తానికి చెక్కు రాసి తనకిచ్చాడని రవితేజ గుర్తు చేసుకున్నాడు.
సినీ పరిశ్రమలో తాను అందుకున్న తొలి చెక్కు కావడంతో దాన్ని మురిపెంగా దాచుకున్నానని.. చాలా రోజుల తర్వాత తనకు డబ్బులు ఎంతో అవసరం పడ్డ పరిస్థితుల్లోనే దాన్ని బ్యాంకులో వేసి డబ్బులు తీసుకున్నానని రవితేజ చెప్పాడు. రూ.3500తో మొదలుపెట్టి ఇప్పుడు పది కోట్లకు పైగా పారితోషకం తీసుకునే స్థాయికి చేరుకోవడమంటే రవిజేతది ఎంత స్ఫూర్తిదాయక ప్రయాణమో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 15, 2021 3:41 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…