మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ హీరోల్లో స్ఫూర్తిదాయక ప్రయాణం అంటే రవితేజదే. అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్నేళ్లు ఆ విభాగంలోనే శ్రమించి.. ఆ తర్వాత క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేసి.. ఆపై హీరోగా చిన్న సినిమాలు చేసి.. చివరికి స్టార్ ఇమేజ్ సంపాదించి ‘మాస్ మహారాజా’గా పేరు తెచ్చుకున్న ఆసక్తికర ప్రస్థానం అతడిది. ప్రస్తుతం టాప్ స్టార్ల తర్వాతి స్థాయిలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటుడు రవితేజే. అతడికి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుతోంది.
లేటెస్ట్ మూవీ ‘క్రాక్’లో లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల తర్వాత ఈ రేంజిలో రెమ్యూనరేషన్ తీసుకోవడమంటే మాటలు కాదు. రెండు మూడు వరుస హిట్లు పడితే మాస్ రాజా రేంజ్ ఇంకా పెరగొచ్చు.
ఐతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న రవితేజ.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..? కేవలం 3500 రూపాయలట. ఆ డబ్బులు ఇచ్చింది సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కావడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవితేజే స్వయంగా వెల్లడించాడు. నాగ్ సొంత సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్లో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’ అసిస్టెంట్ డైరెక్టర్గా తన తొలి చిత్రమని.. ఆ సినిమాకు కృష్ణవంశీ కింద పని చేశానని.. అందుకు గాను నాగ్ రూ.3500 మొత్తానికి చెక్కు రాసి తనకిచ్చాడని రవితేజ గుర్తు చేసుకున్నాడు.
సినీ పరిశ్రమలో తాను అందుకున్న తొలి చెక్కు కావడంతో దాన్ని మురిపెంగా దాచుకున్నానని.. చాలా రోజుల తర్వాత తనకు డబ్బులు ఎంతో అవసరం పడ్డ పరిస్థితుల్లోనే దాన్ని బ్యాంకులో వేసి డబ్బులు తీసుకున్నానని రవితేజ చెప్పాడు. రూ.3500తో మొదలుపెట్టి ఇప్పుడు పది కోట్లకు పైగా పారితోషకం తీసుకునే స్థాయికి చేరుకోవడమంటే రవిజేతది ఎంత స్ఫూర్తిదాయక ప్రయాణమో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 15, 2021 3:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…