టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. కెజిఎఫ్ రూపంలో యష్ సంపాదించుకున్న ప్యాన్ ఇండియా ఇమేజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానికి నిదర్శనమే వసూళ్లు. టికెట్ రేట్ల పెంపు వల్ల ఏపీ తెలంగాణ అమ్మకాలు ఆలస్యంగా మొదలైనప్పటికీ తెల్లవారుఝాము షోల నుంచే సందడి మొదలైపోయింది. ఎలాగూ సెలవు రోజు కావడంతో యూత్, అభిమానులు మొదటి రోజు చూసేయాలని డిసైడ్ అయిపోయారు.
యష్ ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాఖీ భాయ్ గా తనను ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో కళ్ళముందు కనిపిస్తోంది. అలాని చెప్పి పదే పదే అదే జానర్ లో చూడాలని వాళ్ళు కోరుకోవడం లేదు. కమర్షియల్ సబ్జెక్టులు వద్దని చెప్పడం లేదు. కావాల్సిందల్లా థియేటర్ ఎక్స్ పీరియన్స్ పీక్స్ ఇచ్చే కథలను ఎంచుకోమని చెబుతున్నారు. టాక్సిక్ లో యష్ గుర్తించింది అదే. 1947 గోవా బ్యాక్ డ్రాప్ లో మాఫియా అరాచకం కన్నా సెటప్ ఇంకేం కావాలి.
అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హ్యాండిల్ చేయడం పట్ల కామెంట్స్ మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో టాక్సిక్ బాక్సాఫీస్ ఫలితం ఏంటనేది తేలడానికి ఇంకో మూడు నాలుగు రోజులు పడుతుంది. కానీ నాలుగేళ్ల నిరీక్షణకు యష్ గొప్ప ఫలితమైతే అందుకోవాల్సి ఉంది. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ ని దర్శకురాలిగా ఎంచుకోవడం పట్ల ఇండస్ట్రీలోనే ఎన్నో కామెంట్స్ వినిపించాయి. వాటికి బదులు చెప్పాలి.
వీటి సంగతలా ఉంచితే ఇకపై స్పీడ్ పెంచి ప్రభాస్ లాగా ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేసుకునేలా యష్ ప్లానింగ్ చేసుకుంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. హిట్టు ఫ్లాపు అన్నీ మన చేతుల్లో ఉండవు కానీ వేగం మాత్రం హీరోలు దర్శకుల కంట్రోల్ లోనే ఉంటుంది. అలాంటి వాళ్ళతో పని చేస్తే గొప్ప ఫలితాలు దక్కుతాయి. ఇప్పటికైతే యష్ నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కథలు విన్నాడు కానీ కమిట్ మెంట్స్ ఇవ్వలేదు.
This post was last modified on August 26, 2026 12:24 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…