కొత్త ఏడాది మొదలైంది. సినిమాల సందడికి తెర లేచింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ రేసులో నిలిచాయి. నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా, అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని కొత్త సినిమాల కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్లు, టీజర్ల మోత మోగుతోంది. మరోవైపు థియేటర్లలో మళ్లీ సందడి మొదలైన నేపథ్యంలో మున్ముందు పోటీ తీవ్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. అందుకే వేసవి బెర్తుల కోసం చకచకా కర్చీఫ్లు వేసేస్తున్నారు.
వకీల్ సాబ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు తోడు రంగ్ దె, టక్ జగదీష్, అరణ్య లాంటి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ డేట్లపై ఓ అంచనా వచ్చేసింది. ఈ సినిమాలన్నింటి గురించి మీడియాలో తరచుగా వార్తలొస్తున్నాయి. సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్ కూడా రాబోతోంది. ‘రాధేశ్యామ్’ టీజర్ కూడా అతి త్వరలోనే వస్తుందంటున్నారు.
ఐతే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న, పూర్తయిన సినిమాలన్నింటి గురించి ఏదో ఒక అప్ డేట్ ఉంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో ఒక డిస్కషన్ ఉంటోంది. కానీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న కొత్త చిత్రం గురించి మాత్రం చప్పుడే లేదు. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను వేసవికి విడుదల చేద్దామన్న ఆలోచన ఉందంటున్నారు. కానీ గత ఏడాది బాలయ్య పుట్టిన రోజుకు మినీ టీజర్ వదిలాక ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. టైటిల్, ఫస్ట్ లుక్ గురించి చర్చ లేదు. షూటింగ్ గురించి కూడా ఏ సమాచారం బయటికి రావట్లదేు.
ఈ చిత్రాన్ని వేసవికి ఫిక్స్ చేసినట్లయితే.. ఆ దిశగా మీడియాకు లీకులివ్వడమో లేదా అధికారిక ప్రకటన చేయడో చేయాలి. ఆ సీజన్లో సినిమాను దింపేట్లయితే.. బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతికి టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే ఇప్పట్నుంచో ప్రమోషన్కు ఉపయోగపడేది. సినిమా వార్తల్లో ఉండేది. కానీ ఇదేమీ లేకుండా సైలెన్స్ పాటిస్తోంది చిత్ర బృందం. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా.. అది ఏ దశలో ఉంది అనే సమాచారం కూడా లేదు. ముందు షూటింగ్ మీద పూర్తి ఫోకస్ పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్ సంగతి చూద్దామనుకుంటున్నారో ఏమో మరి.
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…