కొత్త ఏడాది మొదలైంది. సినిమాల సందడికి తెర లేచింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ రేసులో నిలిచాయి. నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా, అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని కొత్త సినిమాల కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్లు, టీజర్ల మోత మోగుతోంది. మరోవైపు థియేటర్లలో మళ్లీ సందడి మొదలైన నేపథ్యంలో మున్ముందు పోటీ తీవ్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. అందుకే వేసవి బెర్తుల కోసం చకచకా కర్చీఫ్లు వేసేస్తున్నారు.
వకీల్ సాబ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు తోడు రంగ్ దె, టక్ జగదీష్, అరణ్య లాంటి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ డేట్లపై ఓ అంచనా వచ్చేసింది. ఈ సినిమాలన్నింటి గురించి మీడియాలో తరచుగా వార్తలొస్తున్నాయి. సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్ కూడా రాబోతోంది. ‘రాధేశ్యామ్’ టీజర్ కూడా అతి త్వరలోనే వస్తుందంటున్నారు.
ఐతే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న, పూర్తయిన సినిమాలన్నింటి గురించి ఏదో ఒక అప్ డేట్ ఉంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో ఒక డిస్కషన్ ఉంటోంది. కానీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న కొత్త చిత్రం గురించి మాత్రం చప్పుడే లేదు. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను వేసవికి విడుదల చేద్దామన్న ఆలోచన ఉందంటున్నారు. కానీ గత ఏడాది బాలయ్య పుట్టిన రోజుకు మినీ టీజర్ వదిలాక ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. టైటిల్, ఫస్ట్ లుక్ గురించి చర్చ లేదు. షూటింగ్ గురించి కూడా ఏ సమాచారం బయటికి రావట్లదేు.
ఈ చిత్రాన్ని వేసవికి ఫిక్స్ చేసినట్లయితే.. ఆ దిశగా మీడియాకు లీకులివ్వడమో లేదా అధికారిక ప్రకటన చేయడో చేయాలి. ఆ సీజన్లో సినిమాను దింపేట్లయితే.. బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతికి టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే ఇప్పట్నుంచో ప్రమోషన్కు ఉపయోగపడేది. సినిమా వార్తల్లో ఉండేది. కానీ ఇదేమీ లేకుండా సైలెన్స్ పాటిస్తోంది చిత్ర బృందం. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా.. అది ఏ దశలో ఉంది అనే సమాచారం కూడా లేదు. ముందు షూటింగ్ మీద పూర్తి ఫోకస్ పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్ సంగతి చూద్దామనుకుంటున్నారో ఏమో మరి.
This post was last modified on January 12, 2021 7:00 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…