థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటేనేమి.. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి తక్కువగా ఏమీ లేదు. ఎప్పట్లాగే ఈ సీజన్లో నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. ఐతే మామూలు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. ఏ చిత్రానికీ సరిపడా థియేటర్లు దక్కవు. సంక్రాంతికి మిగతా సీజన్లతో పోలిస్తే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఓవరాల్గా ఈ సీజన్లో వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కానీ పోటీ ఎక్కువైపోతే ఒక్కో సినిమాకు దక్కే వసూళ్ల సంఖ్యలో కోత పడుతుంది. అందులోనూ సంక్రాంతికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మెజారిటీ వసూళ్లను లాగేస్తాయి. టాక్ తేడా ఉన్న సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి. గత ఏడాది హిట్ టాక్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వసూళ్ల మోత మోగగా.. దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే పండక్కి పోటాపోటీగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. లోలోన నిర్మాతల్లో టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఒకప్పట్లా పరిస్థితులు లేవు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవట్లేదు. కరోనా విరామం తర్వాత ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు పూర్తి స్థాయిలో రావట్లేదు. దీనికి తోడు అందుబాటులో ఉన్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లను ఇంకా పున:ప్రారంభించలేదు. ఇందువల్ల ఓవరాల్ థియేటర్ల సంఖ్య తగ్గింది.
ఇక 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల ఇంతకముందుతో పోలిస్తే ఒక్కో సినిమాకు థియేటర్లు సగం సంఖ్యలోనే అందుబాటులో ఉన్నట్లు లెక్క. రెవెన్యూ కూడా సగమే వస్తుంది. ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపేవే. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే దాని పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర దయనీయంగా ఉంటుంది. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటం ఖాయం. మరి సంక్రాంతి చిత్రాల్లో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతుందో.. దేనికి నెగెటివ్ టాక్ వచ్చి దెబ్బ తింటుందో చూడాలి.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…