థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటేనేమి.. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి తక్కువగా ఏమీ లేదు. ఎప్పట్లాగే ఈ సీజన్లో నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. ఐతే మామూలు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. ఏ చిత్రానికీ సరిపడా థియేటర్లు దక్కవు. సంక్రాంతికి మిగతా సీజన్లతో పోలిస్తే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఓవరాల్గా ఈ సీజన్లో వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కానీ పోటీ ఎక్కువైపోతే ఒక్కో సినిమాకు దక్కే వసూళ్ల సంఖ్యలో కోత పడుతుంది. అందులోనూ సంక్రాంతికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మెజారిటీ వసూళ్లను లాగేస్తాయి. టాక్ తేడా ఉన్న సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి. గత ఏడాది హిట్ టాక్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వసూళ్ల మోత మోగగా.. దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే పండక్కి పోటాపోటీగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. లోలోన నిర్మాతల్లో టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఒకప్పట్లా పరిస్థితులు లేవు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవట్లేదు. కరోనా విరామం తర్వాత ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు పూర్తి స్థాయిలో రావట్లేదు. దీనికి తోడు అందుబాటులో ఉన్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లను ఇంకా పున:ప్రారంభించలేదు. ఇందువల్ల ఓవరాల్ థియేటర్ల సంఖ్య తగ్గింది.
ఇక 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల ఇంతకముందుతో పోలిస్తే ఒక్కో సినిమాకు థియేటర్లు సగం సంఖ్యలోనే అందుబాటులో ఉన్నట్లు లెక్క. రెవెన్యూ కూడా సగమే వస్తుంది. ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపేవే. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే దాని పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర దయనీయంగా ఉంటుంది. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటం ఖాయం. మరి సంక్రాంతి చిత్రాల్లో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతుందో.. దేనికి నెగెటివ్ టాక్ వచ్చి దెబ్బ తింటుందో చూడాలి.
This post was last modified on January 9, 2021 12:03 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…