థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటేనేమి.. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి తక్కువగా ఏమీ లేదు. ఎప్పట్లాగే ఈ సీజన్లో నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. ఐతే మామూలు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. ఏ చిత్రానికీ సరిపడా థియేటర్లు దక్కవు. సంక్రాంతికి మిగతా సీజన్లతో పోలిస్తే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఓవరాల్గా ఈ సీజన్లో వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కానీ పోటీ ఎక్కువైపోతే ఒక్కో సినిమాకు దక్కే వసూళ్ల సంఖ్యలో కోత పడుతుంది. అందులోనూ సంక్రాంతికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మెజారిటీ వసూళ్లను లాగేస్తాయి. టాక్ తేడా ఉన్న సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి. గత ఏడాది హిట్ టాక్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వసూళ్ల మోత మోగగా.. దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే పండక్కి పోటాపోటీగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. లోలోన నిర్మాతల్లో టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఒకప్పట్లా పరిస్థితులు లేవు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవట్లేదు. కరోనా విరామం తర్వాత ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు పూర్తి స్థాయిలో రావట్లేదు. దీనికి తోడు అందుబాటులో ఉన్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లను ఇంకా పున:ప్రారంభించలేదు. ఇందువల్ల ఓవరాల్ థియేటర్ల సంఖ్య తగ్గింది.
ఇక 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల ఇంతకముందుతో పోలిస్తే ఒక్కో సినిమాకు థియేటర్లు సగం సంఖ్యలోనే అందుబాటులో ఉన్నట్లు లెక్క. రెవెన్యూ కూడా సగమే వస్తుంది. ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపేవే. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే దాని పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర దయనీయంగా ఉంటుంది. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటం ఖాయం. మరి సంక్రాంతి చిత్రాల్లో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతుందో.. దేనికి నెగెటివ్ టాక్ వచ్చి దెబ్బ తింటుందో చూడాలి.
This post was last modified on January 9, 2021 12:03 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…