థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటేనేమి.. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి తక్కువగా ఏమీ లేదు. ఎప్పట్లాగే ఈ సీజన్లో నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. ఐతే మామూలు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. ఏ చిత్రానికీ సరిపడా థియేటర్లు దక్కవు. సంక్రాంతికి మిగతా సీజన్లతో పోలిస్తే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఓవరాల్గా ఈ సీజన్లో వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కానీ పోటీ ఎక్కువైపోతే ఒక్కో సినిమాకు దక్కే వసూళ్ల సంఖ్యలో కోత పడుతుంది. అందులోనూ సంక్రాంతికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మెజారిటీ వసూళ్లను లాగేస్తాయి. టాక్ తేడా ఉన్న సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి. గత ఏడాది హిట్ టాక్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వసూళ్ల మోత మోగగా.. దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే పండక్కి పోటాపోటీగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. లోలోన నిర్మాతల్లో టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఒకప్పట్లా పరిస్థితులు లేవు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవట్లేదు. కరోనా విరామం తర్వాత ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు పూర్తి స్థాయిలో రావట్లేదు. దీనికి తోడు అందుబాటులో ఉన్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లను ఇంకా పున:ప్రారంభించలేదు. ఇందువల్ల ఓవరాల్ థియేటర్ల సంఖ్య తగ్గింది.
ఇక 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల ఇంతకముందుతో పోలిస్తే ఒక్కో సినిమాకు థియేటర్లు సగం సంఖ్యలోనే అందుబాటులో ఉన్నట్లు లెక్క. రెవెన్యూ కూడా సగమే వస్తుంది. ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపేవే. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే దాని పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర దయనీయంగా ఉంటుంది. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటం ఖాయం. మరి సంక్రాంతి చిత్రాల్లో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతుందో.. దేనికి నెగెటివ్ టాక్ వచ్చి దెబ్బ తింటుందో చూడాలి.
This post was last modified on January 9, 2021 12:03 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…