90వ దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమను ఏలిన బేనర్లలో ‘సూపర గుడ్ ఫిలిమ్స్’ ఒకటి. ఇటు తెలుగులో, అటు తమిళంలో భారీ చిత్రాల నిర్మాణంతో, మేజర్ హిట్లతో ఆ సంస్థ తన ఆధిపత్యాన్ని చాటింది. తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని లాంటి బ్లాక్ బస్టర్లు ఆ సంస్థ నుంచి వచ్చినవే. తమిళంలో ఇంకా పెద్ద హిట్లు అందించిన ఘనత ఆ సంస్థ సొంతం.
కుటుంబమంతా కలిసి చూసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఆ సంస్థ కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఐతే 2000 తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేక ఈ సంస్థ అధినేత ఆర్.బి.చౌదరి ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. దీంతో నెమ్మదిగా ఆయన జోరు తగ్గిపోయింది. ఒక దశ దాటాక సినిమాల నిర్మాణమే ఆపేశారు ఆర్.బి.చౌదరి. ఐతే ఈ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల నిర్మాణంలో బిజీ కావాలని చౌదరి నిర్ణయించుకున్నారు.
2021లో వరుసబెట్టి సినిమాలు తయాలని సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్ణయించుకుంది. ఈ వరుసలో తొలి సినిమాను అనౌన్స్ చేసింది. అది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోయే చిత్రం. దాని పేరు.. ఇష్క్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అనేది దీని ఉపశీర్షిక. ఇష్క్ పేరుతో ఇంతకుముందు నితిన్ హీరోగా ఎనిమిదేళ్ల కిందట తెలుగులో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కూడా.
పాత సినిమాల పేర్లను మళ్లీ వాడుకుని సినిమాలు తీయడం మామూలే కానీ.. కనీసం పదేళ్లయినా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కానీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తక్కువ గ్యాప్లోనే ‘ఇష్క్’ పేరుతో కొత్త సినిమా తీస్తోంది. ఓ బేబీ, జాంబీ రెడ్డి లాంటి సినిమాల్లో నటించిన ఒకప్పటి బాల నటుడు తేజ సజ్జా ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మలయాళ భామ ప్రియ ప్రకాష్ వారియర్ కథానాయిక. ఎస్ఎస్ రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. మరి సూపర్ గుడ్ వారికి రీఎంట్రీలో ఎలాంటి ఆరంభం లభిస్తుందో?
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…