డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు, నిర్మాతలను కలిసి నరేషన్లు ఇస్తుంటారు వర్ధమాన దర్శకులు. ఐతే వారికి అవకాశం ఇవ్వకపోగా.. కష్టాన్ని దోచుకునేవారిని ఏమనాలి? ఇలాంటి ఉదంతాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంటాయి. తమకంటూ గుర్తింపు లేకపోవడం వల్ల ఒక కొత్త డైరెక్టర్ బాధను పట్టించుకునేవారు కూడా ఉండరు.
తాజాగా ఒక కొత్త దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో బాధను వెళ్లగక్కాడు. తన పేరు భరత్ దర్శన్. వచ్చే శుక్రవారం విడుదల కానున్న ‘ఓ సుకుమారి’ చిత్రంతో అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడిగా అవకాశం కోసం వేరే వాళ్లకు కథ చెబితే.. అందులోని ముఖ్య సన్నివేశాలను, డైలాగులను చోరీ చేసినట్లుగా భరత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘ఓ సుకుమారి’ కథ వేరే వాళ్ల దగ్గరికి వెళ్లి.. చివరికి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కలయికలో సినిమాగా తెరకెక్కినట్లు భరత్ దర్శన్ చెప్పాడు. ఐతే తనతో సినిమా తీస్తారన్న ఆశతో కథ చెబితే.. అందులోని ముఖ్య సన్నివేశాలతో పాటు మంచి వన్ లైనర్ డైలాగులను లేపేసినట్లు చెప్పాడు భరత్ దర్శన్. సంక్రాంతికి విడుదలైన ఒక సినిమాలో ముందు ఒక వ్యక్తికి థ్యాంక్స్ కార్డ్ వేశారని.. ఆ వ్యక్తికే తాను ‘ఓ సుకుమారి’ కథ చెప్పగా, అతను ముఖ్య సన్నివేశాలను ఆ చిత్రంలో పెట్టించేశాడని భరత్ తెలిపాడు.
మరోవైపు ఒక హీరోకు ఈ స్క్రిప్టు పంపిస్తే.. అతను తాను నటించిన సినిమాలో తన వన్ లైనర్స్ వాడేశాడని భరత్ దర్శన్ తెలిపాడు. ‘ఓ సుకుమారి’ షూటింగ్ సగంలో ఉండగా తన సీన్లు, డైలాగులు వేరే సినిమాలో ఉన్న సంగతి తెలిసి, మళ్లీ స్క్రిప్టు రీరైట్ చేసుకోవాల్సి వచ్చిందని భరత్ తెలిపాడు. కొత్త వాళ్లు కథలు చెప్పేటపుడు జాగ్రత్తగా ఉండాలని.. పద్ధతి ప్రకారం వెళ్లాలని.. అగ్రిమెంట్లు చేసుక్ోవాలని.. లేకపోతే ఇలా చౌర్యం జరుగుతుందని అతనన్నాడు.
This post was last modified on July 10, 2026 4:22 pm
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…