తాజాగా ఓ టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాతి సినిమా మహేష్బాబుతో ఉంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్కు తీపి కబురు చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి- మహేష్ మూవీ కన్ఫార్మ్ కాగానే వీరిద్దరి కాంబోలో ఎలాంటి జోనర్ సినిమా వస్తుందా? అని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే జక్కన్నతో ‘బాహుబలి’ టైపులో ఓ ఫిక్షినల్ హిస్టారికల్ మూవీ చేయడానికే మహేష్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్.
ఇప్పటిదాకా మహేష్ బాబు కెరీర్లో హిస్టారికల్ మూవీ లేదు. తండ్రి కృష్ణ ఎన్నో హిస్టారికల్, పిరియాడిక్ మూవీస్లో నటించినా, మహేష్ మాత్రం ఆ సాహసం ఇప్పటిదాకా చేయలేకపోయాడు. అయితే ‘రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి తాను రెఢీ!’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మహేష్. దాంతో ఇప్పుడు ఈ కాంబోలో వచ్చే మూవీ అలాగే ఉండబోతుందట.
నిజానికి కృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’ మూవీని రిమేక్ చేయాలనేది మహేష్ డ్రీమ్. అలాగే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘గూఢచారి 117’ వంటి జేమ్స్ బాండ్ థ్రిల్లర్ తీయాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. కాబట్టి మహేష్ సినిమాలో అల్లూరి కాన్సెప్ట్ను మళ్లీ తీసుకోకపోవచ్చు రాజమౌళి. మరి మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటాడో చూడాలి.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…