మాస్ రాజా రవితేజ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. అయినా సరే.. ఆ ప్రభావం ఏమీ ఆయన కొత్త సినిమా క్రాక్ మీద పడలేదు. ఈ సినిమాకు ముందు నుంచి మంచి బజ్ ఉంది. విడుదల దగ్గర పడేసరికి హైప్ మరింత పెరిగింది. రవితేజ మంచి ఫామ్లో ఉన్నప్పటి స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్లకు తోడు పాటలు కూడా ఎంటర్టైనింగ్గా ఉండటం అందుకు కారణం కావచ్చు.
గోపీచంద్ మలినేని, రవితేజ కలయికలో డాన్ శీను, బలుపు లాంటి హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే.. సోలోగా సినిమాను రిలీజ్ చేసి ప్రయోజనం పొందాలని చూస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాకు అన్నీ ప్రస్తుతానికి సానుకూలంగానే కనిపిస్తున్నాయి.
కానీ ఇలాంటి సమయంలో క్రాక్కు వ్యతిరేకంగా ఓ వర్గం సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా కాకముందే సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా లేదని.. సెన్సార్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేసి వైరల్ చేసే ప్రయత్నం చేశారు.
తాజాగా ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ కూడా ఉన్న ఒక నార్త్ జర్నలిస్ట్ అయితే.. క్రాక్ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదని, అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్గా ఉన్నాయని.. ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉండబోతున్నాయని ట్వీట్ వేయడం గమనార్హం. నిజానికి క్రాక్కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. సినిమాకు మంచి హైప్ కనిపిస్తోంది. అలాంటి సినిమా గురించి ఇలా ట్వీట్ వేయడం చూస్తే.. ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నెగెటివ్ ప్రచారం లాగా ఉంది. సంక్రాంతికి పోటీలో ఉన్న వేరే సినిమాల వ్యక్తులెవరైనా ఈ పని చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on January 6, 2021 11:56 am
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…