మాస్ రాజా రవితేజ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. అయినా సరే.. ఆ ప్రభావం ఏమీ ఆయన కొత్త సినిమా క్రాక్ మీద పడలేదు. ఈ సినిమాకు ముందు నుంచి మంచి బజ్ ఉంది. విడుదల దగ్గర పడేసరికి హైప్ మరింత పెరిగింది. రవితేజ మంచి ఫామ్లో ఉన్నప్పటి స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్లకు తోడు పాటలు కూడా ఎంటర్టైనింగ్గా ఉండటం అందుకు కారణం కావచ్చు.
గోపీచంద్ మలినేని, రవితేజ కలయికలో డాన్ శీను, బలుపు లాంటి హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే.. సోలోగా సినిమాను రిలీజ్ చేసి ప్రయోజనం పొందాలని చూస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాకు అన్నీ ప్రస్తుతానికి సానుకూలంగానే కనిపిస్తున్నాయి.
కానీ ఇలాంటి సమయంలో క్రాక్కు వ్యతిరేకంగా ఓ వర్గం సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా కాకముందే సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా లేదని.. సెన్సార్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేసి వైరల్ చేసే ప్రయత్నం చేశారు.
తాజాగా ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ కూడా ఉన్న ఒక నార్త్ జర్నలిస్ట్ అయితే.. క్రాక్ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదని, అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్గా ఉన్నాయని.. ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉండబోతున్నాయని ట్వీట్ వేయడం గమనార్హం. నిజానికి క్రాక్కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. సినిమాకు మంచి హైప్ కనిపిస్తోంది. అలాంటి సినిమా గురించి ఇలా ట్వీట్ వేయడం చూస్తే.. ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నెగెటివ్ ప్రచారం లాగా ఉంది. సంక్రాంతికి పోటీలో ఉన్న వేరే సినిమాల వ్యక్తులెవరైనా ఈ పని చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on January 6, 2021 11:56 am
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…