రవితేజకు చాలా కాలంగా చెప్పుకోతగ్గ హిట్టు లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం యావరేజ్ సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతోంది. అయితే ఏ దశలోను రవితేజ పారితోషికం తగ్గించుకోలేదు. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కులు బాగా వస్తుంటాయి కనుక నిర్మాతలు తనకు అడిగినంత ఇస్తూ వచ్చారు. అయితే లాక్డౌన్ తర్వాత నిర్మాతలు ఆచి తూచి ఖర్చు పెడుతున్నారు. అందుకే రవితేజను పారితోషికం తగ్గించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాపుల్లో వున్నాడు కనుకే తనను పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనేది రవితేజకు తెలుసు.
అందుకే క్రాక్ విడుదలయ్యే వరకు కొత్త సినిమా సైన్ చేయకూడదని డిసైడయ్యాడు. ముగ్గురు నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నా కానీ క్రాక్ రిలీజ్ తర్వాతే తన రెమ్యూనరేషన్ ఎంతనేది ఫిక్స్ చేస్తానంటున్నాడు. క్రాక్పై రవితేజ చాలా నమ్మకంతో వున్నాడు. ఇది కానీ క్లిక్ అయితే తనతో సినిమా తీద్దామని వచ్చేవాళ్లకు షాక్ తప్పదు. మామూలుగానే డజను కోట్లు అడుగుతున్నాడని టాక్. ఖిలాడీ చిత్రానికి సింగిల్ పేమెంట్లో అంత పారితోషికం తీసుకుని సంతకం చేసాడట. ఇక క్రాక్ కానీ బ్లాక్బస్టర్ అయితే రవితేజ డిమాండ్ ఎంత వుంటుందో ఏంటో ఊహించసాధ్యం కాదట.
This post was last modified on January 6, 2021 1:56 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…