రవితేజకు చాలా కాలంగా చెప్పుకోతగ్గ హిట్టు లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం యావరేజ్ సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతోంది. అయితే ఏ దశలోను రవితేజ పారితోషికం తగ్గించుకోలేదు. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కులు బాగా వస్తుంటాయి కనుక నిర్మాతలు తనకు అడిగినంత ఇస్తూ వచ్చారు. అయితే లాక్డౌన్ తర్వాత నిర్మాతలు ఆచి తూచి ఖర్చు పెడుతున్నారు. అందుకే రవితేజను పారితోషికం తగ్గించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాపుల్లో వున్నాడు కనుకే తనను పారితోషికం తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనేది రవితేజకు తెలుసు.
అందుకే క్రాక్ విడుదలయ్యే వరకు కొత్త సినిమా సైన్ చేయకూడదని డిసైడయ్యాడు. ముగ్గురు నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నా కానీ క్రాక్ రిలీజ్ తర్వాతే తన రెమ్యూనరేషన్ ఎంతనేది ఫిక్స్ చేస్తానంటున్నాడు. క్రాక్పై రవితేజ చాలా నమ్మకంతో వున్నాడు. ఇది కానీ క్లిక్ అయితే తనతో సినిమా తీద్దామని వచ్చేవాళ్లకు షాక్ తప్పదు. మామూలుగానే డజను కోట్లు అడుగుతున్నాడని టాక్. ఖిలాడీ చిత్రానికి సింగిల్ పేమెంట్లో అంత పారితోషికం తీసుకుని సంతకం చేసాడట. ఇక క్రాక్ కానీ బ్లాక్బస్టర్ అయితే రవితేజ డిమాండ్ ఎంత వుంటుందో ఏంటో ఊహించసాధ్యం కాదట.
This post was last modified on January 6, 2021 1:56 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…