రాజకీయాల్లోకి మళ్లీ కొత్తగా వారసులు వస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ వారసులు వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తెరమీదికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల్లో వీరి హవా ఎక్కువగా ఉంది. గత ఏడాది ఎన్నిక ల్లో టీడీపీ తరఫున ఎక్కువ మంది పోటీకి దిగారు. ఇక, వచ్చే 2024 ఎన్నికల నాటికి ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను ఎక్కువ మంది వారసులే పోటీకి దిగుతారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది వారసులు తమ తమ ప్రయత్నా లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మరింత మంది వారసులను రంగంలోకి దింపేందుకు టీడీపీ, వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారు.
అయితే.. వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నా.. వీరిలో పస ఎంత ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది ఎన్నికలను పరిశీలిస్తే.. టీడీపీలో భారీ ఎత్తున వారసులు పోటీ చేశారు. అయితే.. గత ఏడాదికి మించి ఎక్కువ మంది వారసులు వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతారనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ వారసులు ఏమేరకు సక్సెస్ అవుతారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. గత ఏడాది ఎన్నికలను పరిశీలిస్తే.. టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ.. కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తెగా రంగంలోకి దిగి విజయం దక్కించుకున్నారు. ఇక, మిగిలిన వారిలో అందరూ ఓడిపోయారు. భారీ అంచనాలు ఉన్న పరిటాల శ్రీరాం, టీజీ వెంకటేశ్, కేఈ శ్యాంబాబు, గాలి భానుప్రకాశ్ వంటి వారు కూడా ఓటమి పాలయ్యారు.
అయితే.. ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం ఏంటంటే.. వారసులుగా వస్తున్న వారిలో నిబద్దతే కరువు అవుతోంది. కేవలం పదవులను అనుభవించాలనే వ్యూహంతో వస్తున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వీరికి ప్రజాదరణ ఉండడం లేదు. ఇక, వచ్చే ఎన్నికల్లో దివంగత కోడెల కుమారుడు శివరామకృష్ణ, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, అయ్యన్నపాత్రుడి కుమారుడు, యనమల రామకృష్ణుడి కుమార్తె.. ఇలా పది మంది వరకు కొత్తగా పోటీకి దిగుతున్నారు. మరి వీరు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇక, వైసీపీ విషయానికి వస్తే. గత ఏడాది వారసుల రాజకీయాలు తక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం వీరి సంఖ్య భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
మంత్రులు నారాయణస్వామి కుమారుడు నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వరకు చాలా మంది నాయకులు తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయా వారసులు ప్రజలకు టచ్లో ఉంటున్నారా? అనే ది ప్రధాన ప్రశ్న. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా.. నాయకులు ఎవరి దారిలో వారు ఉన్నారు. ఇక, వారసులు రాజకీయాలను ఎంజాయ్ చేయడానికో.. అధికారం చలాయించడానికో .. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు కనెక్ట్ అవుతున్నవారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఏదేమైనా.. వారసులు మళ్లీ తమ భవితవ్యాన్ని తేల్చుకోనుండడం గమనార్హం. మరి ఈసారైనా వీరి సంఖ్య పెరుగుతుందా? లేదా చూడాలి.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…