నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను ఖరారు చేయడానికి చాలా సమయమే తీసుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’తో పలకరించిన అతను.. ఆ తర్వాత ఇప్పటిదాకా కొత్త సినిమాను ప్రకటించలేదు. ‘118’తో ఫామ్లోకి వచ్చిన నందమూరి హీరోకు ‘ఎంత మంచివాడవురా’ మంచి విజయాన్నందిస్తుందనుకుంటే.. కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో తర్వాత ఎలాంటి సినిమా ఎంచుకోవాలనే విషయంలో అతను అయోమయంలో పడ్డాడు.
మారుతి ఓ కథ చెప్పగా.. దాన్ని కళ్యాణ్ రామ్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇంకేవో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి కానీ.. ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
గత ఏడాది మలయాళంలో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘అంజామ్ పత్తిర’ ఒకటి. కుంచుకోబోబన్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకరి తర్వాత ఒకరు అదృశ్యం కావడం.. తర్వాత వాళ్లు దారుణంగా హత్యకు గురి కావడం.. అందులో ఒక ప్యాటెర్న్ కనిపించడం.. పోలీస్ డిపార్ట్మెంట్కు పెద్ద సవాలుగా మారిన ఈ కేసును ఛేదించడానికి మానసిక వైద్య నిపుణుడైన హీరో రంగంలోకి దిగడం.. ఈ నేపథ్యంలో ‘అంజామ్ పత్తిర’ నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. థ్రిల్కు గురి చేస్తూ సాగే ‘అంజామ్ పత్తిర’ థ్రిల్లర్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకుముందు కళ్యాణ్ రామ్లో ‘118’ అనే థ్రిల్లర్ తీసిన గుహన్ ఈ రీమేక్కు దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇద్దరూ తెలుగు రీమేక్ స్క్రిప్టు మీద చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on January 5, 2021 2:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…