నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను ఖరారు చేయడానికి చాలా సమయమే తీసుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’తో పలకరించిన అతను.. ఆ తర్వాత ఇప్పటిదాకా కొత్త సినిమాను ప్రకటించలేదు. ‘118’తో ఫామ్లోకి వచ్చిన నందమూరి హీరోకు ‘ఎంత మంచివాడవురా’ మంచి విజయాన్నందిస్తుందనుకుంటే.. కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో తర్వాత ఎలాంటి సినిమా ఎంచుకోవాలనే విషయంలో అతను అయోమయంలో పడ్డాడు.
మారుతి ఓ కథ చెప్పగా.. దాన్ని కళ్యాణ్ రామ్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇంకేవో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి కానీ.. ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
గత ఏడాది మలయాళంలో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘అంజామ్ పత్తిర’ ఒకటి. కుంచుకోబోబన్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకరి తర్వాత ఒకరు అదృశ్యం కావడం.. తర్వాత వాళ్లు దారుణంగా హత్యకు గురి కావడం.. అందులో ఒక ప్యాటెర్న్ కనిపించడం.. పోలీస్ డిపార్ట్మెంట్కు పెద్ద సవాలుగా మారిన ఈ కేసును ఛేదించడానికి మానసిక వైద్య నిపుణుడైన హీరో రంగంలోకి దిగడం.. ఈ నేపథ్యంలో ‘అంజామ్ పత్తిర’ నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. థ్రిల్కు గురి చేస్తూ సాగే ‘అంజామ్ పత్తిర’ థ్రిల్లర్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకుముందు కళ్యాణ్ రామ్లో ‘118’ అనే థ్రిల్లర్ తీసిన గుహన్ ఈ రీమేక్కు దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇద్దరూ తెలుగు రీమేక్ స్క్రిప్టు మీద చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on January 5, 2021 2:07 pm
సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం…
బాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు ఖాన్ త్రయమే ఆధిపత్యం చలాయించింది. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య నంబర్ వన్…
కాదేదీ ఫ్యాన్ వార్స్కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు.…
పోయినేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు నుంచి ఒక కళాఖండం రిలీజైంది. దాని పేరు.. లైలా. మన దగ్గర డిజాస్టర్లు…
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి…
మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి…