సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను మొదలుపెట్టారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సినిమా మొదలైనపుడు గత ఏడాది దసరాకే రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఆ దసరా ఎప్పుడో పోయింది. ఇంకో దసరాకైనా సినిమా రిలీజవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కొన్ని నెలల నుంచి ఈ చిత్రం గురించి ఏ అప్డేట్ లేదు. అనుకున్న బడ్జెట్ ఎప్పుడో ఖర్చయిపోయిందని.. వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఇంకా సినిమా పూర్తి కాలేదని.. ఈ చిత్రాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో, బడ్జెట్ ఎలా రికవర్ చేయాలో తెలియక నిర్మాత సతమతం అవుతున్నాడని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టీం ఆ ప్రచారాన్ని ఖండించలేదు. సినిమా గురించి అప్డేటూ ఇవ్వలేదు. హీరో సహా మీడియాకు కూడా దొరకలేదు.
ఐతే ‘సంబరాల యేటి గట్టు’ నిర్మాత తమ సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన ‘హనుమాన్’ చిత్రాన్ని త్రీడీలో రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన తేజు మీడియాకు అందుబాటులోకి వచ్చాడు. అక్కడ అతడికి ‘సంబరాల యేటి గట్టు’ గురించి మెగా ఫ్యాన్స్ నుంచి ప్రశ్న ఎదురైంది.
కాస్త ఇబ్బంది పడుతూనే సమాధానం చెప్పాడు తేజు. ఓటీటీలో వివిధ భాషల ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూ ప్రేక్షకులు చాలా తెలివి సంపాదిస్తున్నారని.. ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని తేజు అన్నాడు.
ప్రస్తుతం ఆషామాషీ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సంతృప్తి చెందట్లేదని.. అందుకే తాను సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని.. అందుకే టైం తీసుకుని సినిమాను రెడీ చేస్తున్నామని అన్నాడు. ఐతే తేజు సమాధానం ఏదో కవరింగ్లా ఉందే తప్ప.. అసలు ‘సంబరాల యేటి గట్టు’ స్టేటస్ ఏంటి.. ఆ చిత్రం ఎప్పుడు రిలీజవుతుంది అన్నది మాత్రం అతను వెల్లడించకపోవడం మెగా అభిమానులను నిరాశపరిచింది.
This post was last modified on June 22, 2026 10:26 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…