ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్లు ఇప్పుడు సెక్సీ ఫోటోలను డైరెక్టుగా తమ పేజ్లో పెట్టడం లేదు. ఇన్స్టా స్టోరీలంటూ ఒక్క రోజు మాత్రమే కనిపించే చోట పెడుతున్నారు. ఆమధ్య సమంత తన బాత్టబ్ ఫోటోను అలా ఇన్స్టా స్టోరీ రూపంలోనే షేర్ చేసింది. తాజాగా కియారా అద్వానీ కూడా మాల్దీవుల నుంచి బికినీ ఫోటోను ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఆ స్క్రీన్ గ్రాబ్ని పట్టేసి గ్లామ్ పేజ్లు రన్ చేసేవాళ్లు ట్రెండ్ చేసేసారు… అది వేరే సంగతి. తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా మాల్దీవులకు వెళ్లింది.
లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తన ‘ఇందూ కీ జవానీ’ సినిమా అట్టర్ ఫ్లాపయినా కియారా ఫేస్లో గ్లో ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు హిందీ చిత్ర సీమలో ఫుల్ డిమాండ్లో వుంది. మూడు భారీ సినిమాలు చేస్తోంది, అలాగే నెట్ఫ్లిక్స్ తో డీల్ కూడా వుంది. అందుకే తెలుగు చిత్ర సీమనుంచి ఎన్ని అవకాశాలు వెళ్లినా ఆమె ఏదీ ఒప్పుకోలేదు.
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో చేసిన కియారా ఇప్పుడు మళ్లీ తెలుగులో నటించాలంటే అయిదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. దానిని బట్టి ఆమెకు బాలీవుడ్లో వున్న డిమాండ్ ఎంతో తెలుస్తోంది కదా.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…