లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఇతనొకడు. నగరం అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతను.. ఆ సినిమాతో ఓ మోస్తరు ఫలితాన్నే అందుకున్నాడు. కానీ లోకేష్ రెండో సినిమా ఖైదీ మాత్రం అతడికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా పెద్ద లీగ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది.
ఆ సినిమా సూపర్ హిట్టవడంతో ఏకంగా విజయ్ లాంటి సూపర్ స్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు లోకేష్. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే అందరూ ఫిక్సయిపోయారు.ఈ చిత్రం విడుదల కాకముందే లోకనాయకుడు కమల్ హాసన్తో విక్రమ్ అనే సినిమా మొదలుపెట్టాడు లోకేష్. ఆ సినిమా టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉండటంతో లోకేష్ డిమాండ్ ఇంకా పెరిగిపోయింది.
లోకేష్ త్వరలోనే తెలుగులోకి కూడా అరంగేట్రం చేయొచ్చని ఒక ప్రచారం నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అతడికి అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. కాగా లోకేష్.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాస్టర్ ప్రమోషన్ల సందర్భంగా ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేషే స్వయంగా అంగీకరించాడు.
రామ్ చరణ్తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది, అందులో నిజమెంత అని ఇంటర్వ్యూయర్ లోకేష్ను అడగ్గా.. చర్చలు జరిగిన మాట వాస్తవం, అయితే ఒక సమయంలో ఒక సినిమానే చేయాలి కాబట్టి ప్రస్తుతం కమల్ హాసన్తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు సంగతి చూస్తానని లోకేష్ అన్నాడు. మరి మైత్రీ బేనర్లోనే ఈ సినిమా చేస్తాడా.. ఈ చిత్రం ఎప్పటికి పట్టాలెక్కుతుంది అన్నది క్లారిటీ లేదు కానీ.. చరణ్-లోకేష్ కాంబినేషన్లో ఒక సినిమా అయితే గ్యారెంటీ అన్నమాట.
This post was last modified on January 3, 2021 8:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…