లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఇతనొకడు. నగరం అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతను.. ఆ సినిమాతో ఓ మోస్తరు ఫలితాన్నే అందుకున్నాడు. కానీ లోకేష్ రెండో సినిమా ఖైదీ మాత్రం అతడికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా పెద్ద లీగ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది.
ఆ సినిమా సూపర్ హిట్టవడంతో ఏకంగా విజయ్ లాంటి సూపర్ స్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు లోకేష్. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే అందరూ ఫిక్సయిపోయారు.ఈ చిత్రం విడుదల కాకముందే లోకనాయకుడు కమల్ హాసన్తో విక్రమ్ అనే సినిమా మొదలుపెట్టాడు లోకేష్. ఆ సినిమా టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉండటంతో లోకేష్ డిమాండ్ ఇంకా పెరిగిపోయింది.
లోకేష్ త్వరలోనే తెలుగులోకి కూడా అరంగేట్రం చేయొచ్చని ఒక ప్రచారం నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అతడికి అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. కాగా లోకేష్.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాస్టర్ ప్రమోషన్ల సందర్భంగా ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేషే స్వయంగా అంగీకరించాడు.
రామ్ చరణ్తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది, అందులో నిజమెంత అని ఇంటర్వ్యూయర్ లోకేష్ను అడగ్గా.. చర్చలు జరిగిన మాట వాస్తవం, అయితే ఒక సమయంలో ఒక సినిమానే చేయాలి కాబట్టి ప్రస్తుతం కమల్ హాసన్తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు సంగతి చూస్తానని లోకేష్ అన్నాడు. మరి మైత్రీ బేనర్లోనే ఈ సినిమా చేస్తాడా.. ఈ చిత్రం ఎప్పటికి పట్టాలెక్కుతుంది అన్నది క్లారిటీ లేదు కానీ.. చరణ్-లోకేష్ కాంబినేషన్లో ఒక సినిమా అయితే గ్యారెంటీ అన్నమాట.
This post was last modified on January 3, 2021 8:46 pm
కాదేది కాపీకనర్హం అన్నట్టు సినిమాలకిచ్చే సంగీతంలోనూ ఈ పోకడ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ పాటలను వాడుకోవడం, మత్తు వదలరాలో…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల…
ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో…
బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.…
మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి…
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…