2024 ఎన్నికలకు ముందు ఒక రెండేళ్లు సినిమాల కోసం కేటాయించి.. సాధ్యమైనన్ని ఎక్కువ చిత్రాలు చేసేయ్యాలని ప్రణాళిక రచించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆయన ప్రణాళికలు అనుకున్నట్లుగా నడవట్లేదు. కరోనా వచ్చి పవన్ విలువైన సమయాన్ని చాలానే హరించేసింది. ఏడెనిమిది నెలల పాటు పవన్ ఖాళీగా ఉండిపోయాడు.
కరోనా లేకుంటే ఈ సమయంలో వకీల్ సాబ్తో పాటు క్రిష్ సినిమాను కూడా పూర్తి చేసి హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టేసేవాడేమో. కానీ కరోనా బ్రేక్ వల్ల ఇప్పటికి వకీల్ సాబ్ మాత్రమే పూర్తి చేయగలిగాడు. దాని పని పూర్తవ్వగానే కొత్త ఏడాదిలో క్రిష్ సినిమాను ముందుగా పట్టాలెక్కించాలనుకున్నాడు. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్లో పాల్గొని తర్వాత అయ్యప్పనుం కోషీయుంను కూడా మొదలుపెట్టి సమాంతరంగా ఈ రెండు చిత్రాల షూటింగ్కు హాజరవ్వలనుకున్నాడు.
కానీ ఇంతలో క్రిష్ కరోనా బారిన పడటంతో పవన్ ప్లాన్ మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా క్రిష్ పాజిటివ్ అని తేలింది. దీంతో రెండు మూడు వారాలు క్వారంటైన్లో ఉండాల్పిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో క్రిష్ సినిమా కోసం పవన్ కేటాయించిన డేట్లు వృథా అయిపోతున్నాయి.
అయ్యప్పనుం కోషీయుం రీమేక్ తొలి షెడ్యూల్ను కొంచెం ముందుకు జరిపి షూట్ చేయగలిగితే పవన్ డేట్లను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ తక్కువ వ్యవధిలో అలా చేయగలరా అన్నది చూడాలి. వచ్చే ఆరేడు నెలల్లో ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. తర్వాత హరీష్ శంకర్ సినిమాను కూడా ఈ ఏడాదే పట్టాలెక్కించాలనుకున్నాడు. దాని తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…