2024 ఎన్నికలకు ముందు ఒక రెండేళ్లు సినిమాల కోసం కేటాయించి.. సాధ్యమైనన్ని ఎక్కువ చిత్రాలు చేసేయ్యాలని ప్రణాళిక రచించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆయన ప్రణాళికలు అనుకున్నట్లుగా నడవట్లేదు. కరోనా వచ్చి పవన్ విలువైన సమయాన్ని చాలానే హరించేసింది. ఏడెనిమిది నెలల పాటు పవన్ ఖాళీగా ఉండిపోయాడు.
కరోనా లేకుంటే ఈ సమయంలో వకీల్ సాబ్తో పాటు క్రిష్ సినిమాను కూడా పూర్తి చేసి హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టేసేవాడేమో. కానీ కరోనా బ్రేక్ వల్ల ఇప్పటికి వకీల్ సాబ్ మాత్రమే పూర్తి చేయగలిగాడు. దాని పని పూర్తవ్వగానే కొత్త ఏడాదిలో క్రిష్ సినిమాను ముందుగా పట్టాలెక్కించాలనుకున్నాడు. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్లో పాల్గొని తర్వాత అయ్యప్పనుం కోషీయుంను కూడా మొదలుపెట్టి సమాంతరంగా ఈ రెండు చిత్రాల షూటింగ్కు హాజరవ్వలనుకున్నాడు.
కానీ ఇంతలో క్రిష్ కరోనా బారిన పడటంతో పవన్ ప్లాన్ మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా క్రిష్ పాజిటివ్ అని తేలింది. దీంతో రెండు మూడు వారాలు క్వారంటైన్లో ఉండాల్పిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో క్రిష్ సినిమా కోసం పవన్ కేటాయించిన డేట్లు వృథా అయిపోతున్నాయి.
అయ్యప్పనుం కోషీయుం రీమేక్ తొలి షెడ్యూల్ను కొంచెం ముందుకు జరిపి షూట్ చేయగలిగితే పవన్ డేట్లను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ తక్కువ వ్యవధిలో అలా చేయగలరా అన్నది చూడాలి. వచ్చే ఆరేడు నెలల్లో ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. తర్వాత హరీష్ శంకర్ సినిమాను కూడా ఈ ఏడాదే పట్టాలెక్కించాలనుకున్నాడు. దాని తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్లో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 3, 2021 9:17 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…